తెలుగు రియాల్టీ షో బిగ్బాస్ రెండో సీజన్ ఎంతటి సక్సెస్ అయిందో అందరికి తెలిసిందే.బిగ్బాస్ రెండో సీజన్ మొత్తం ఒక్కరి చూట్టునే తిరిగింది.కౌశల్ ఒక్కడే బిగ్బాస్ రెండో సీజన్ నడిపించాడు.రెండో సీజన్ కంటెస్టెంట్స్ మొత్తం కౌశల్ను టార్గెట్ చేసుకుని గేమ్ ఆడారు.ఒక కౌశల్ ఆడుతున్న విధానానికి అతనికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చిన సంగతి తెలిసిందే.తరువాత అతను ఫైనల్కు వెళ్లడం, టైటిల్ను గెలవడం అన్ని జరిగిపోయ్యాయి.బిగ్బాస్ రెండో సీజన్ అయిన తరువాత కూడా కంటెస్టెంట్స్ మధ్య వార్ కొనసాగుతునే ఉంది.తాజాగా బాబు గోగినేనితో డిబేట్ కి దిగారు కౌశల్ అతడి భార్య నీలిమ.
ఈ చర్చలో కౌశల్ ఆర్మీ అనేది బిగ్ బాస్ సీజన్ 2 ప్రారంభం కాకముందే మొదలైందని, అంతా ముందే ప్లాన్ చేసుకొని కుటుంబ సభ్యులతో మేనేజ్ చేయించుకుంటూ కౌశల్ బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఆడాడంటూ బాబు గోగినేని ఆరోపణలు చేశారు. దానికి అతడి దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కౌశల్ భార్య నీలిమ.. కౌశల్ ఆర్మీకి డబ్బులు ఇచ్చినట్లుగా మీ వద్ద ప్రూఫ్ ఉంటే మాట్లాడండి.. లేదంటే మాట్లాడకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌశల్ పేరుతో సోషల్ మీడియాలో కొన్ని వేలకు పైగా అకౌంట్స్ ఉన్నాయి.. వాటన్నింటినీ డబ్బులిచ్చి క్రియేట్ చేయడం కుదురుతుందా అంటూ ప్రశ్నించింది.ఏది ఏమైనప్పటికి షో ముగిసిని ఇంకా వీరి మధ్య గొడవలు మాత్రం సర్థుమణగడం లేదు.