తెలుగు రియాల్టీ షో బిగ్బాస్ రెండో సీజన్ ముగిసి చాలాకాలమైన ఇప్పటికి దాని గురించి చర్చ నడుస్తునే ఉంది.కంటెస్టెంట్లు ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకుంటునే ఉన్నారు.చాలాకాలంగా సినిమాలు లేక ఖాళీగా ఉంటోన్న హీరో తనీష్ బిగ్బాస్ రెండో సీజన్లో సెలబ్రిటీగా పాల్గోన్నాడు.షో మొదటి నుంచి ఆవేశపరుడిగా పేరు తెచ్చుకున్న తనీష్ ,టైటీల్ కోసం కౌశల్తో పోటీ పడ్డాడు.పోటీ పడ్డాడు అనే దాని కన్నా గొడవలు పడ్డాడు అని చెబితే బాగుంటుంది.తనీష్ టైటిల్ అయితే గెలవలేదు కాని బయట మాత్రం ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ మాత్రం గెలుచుకున్నాడు.బిగ్బాస్ తన కెరీర్కు ఉపయోగపడుతుందని భావించిన తనీష్కు నిరాశే ఎదరైంది అని చెప్పాలి.తనీష్ తో చిన్న సినిమాలు చేసి రిలీజ్ కు సిద్దంగా ఉన్నవారంతా బిగ్బాస్ నుంచి బయిటకు రాగానే ఆ క్రేజ్ తో రిలీజ్ చేసి ఓపినింగ్స్ రప్పించుకోవచ్చు..బిజినెస్ చేసుకోవచ్చు అని భావించారు.
అలాంటి మ్యాజిక్ ఏదీ జరగకపోవటంతో అంతా నిరాశకు గురి అయ్యారు. తనీష్ కూడా ఇది ఊహించని పరిణామమే. క్రేజ్ మొత్తం కట్టుకట్టుకుని కౌశల్ చుట్టూ చేరటంతో మిగతా కంటిస్టెంట్స్ ఎవరూ హైలెట్ కాలేదు. వాస్తవానికి బిగ్ బాస్ నుంచి బయిటకు రాగానే…ఇంటర్వూలు ప్లాన్ చేసుకుంటారనుకున్నారు. అయితే మీడియా వాళ్లు కౌశల్ కు ఇచ్చిన ప్రయారిటీలో వన్ పర్శంట్ కూడా మిగతా వాళ్ళకు ఇవ్వలేదు. ఈ నేపధ్యంలో తనీష్ కొత్త చిత్రం `దేశ దిమ్మరి` రిలీజ్ కు రెడీ అయ్యింది. మీడియా కౌశల్కు ఇచ్చిన ప్రాధన్యత ఇవ్వడం లేదని వాపోతున్నాడు తనీష్.తాను నటించిన దేశ దిమ్మరి యావరేజ్గా ఆడిన తనకు అవకాశాలు వస్తాయని భావిస్తున్నాడు తనీష్.బిగ్బాస్కి వెళ్లడం ద్వారా కెరీర్కు హెల్ప్ మాట దేవుడు ఏరుగు,కెరీర్ మొత్తం నాశనం అయిందని భావిస్తున్నాడట తనీష్.