Saturday, May 4, 2024
- Advertisement -

బిగ్ బాస్ : హౌస్ లోకి అందరు.. ఎందుకు వచ్చారు ?

- Advertisement -

తెలుగు బిగ్ బాస్ షో ప్రస్తుతం చివరి వారంలో ఉంది. అయితే ప్రస్తుతం హౌస్ లో ఐదుగురు.. రాహుల్, శ్రీముఖి, వరుణ్, అలీ, బాబా మాస్టర్లు ఉన్న విషయం తెలిసిందే. వీరిలో ఎవరు టైటిల్ ను దక్కించుకుంటారా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే శ్రీముఖి విన్నర్ అయిందని సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కానీ అది అధికారిక ఫోటో కాదని.. ఎవరో కావాలనే ఫేక్ క్రియేట్ చేశారని వార్తలు వస్తున్నాయి.

ఇది పక్కన పెడితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ సంఖ్య పెరిగింది. గతంలో ఎలిమినేట్ అయిన వారు తిరిగి హౌస్ లోకి వచ్చారు. బిగ్ బాస్ మరో రెండు రోజుల్లో ముగింపు ఉండటంతో ఫైనల్ కంటెస్టెంట్లకు బిగ్ బా సర్ ఫ్రైజ్ ఇవ్వనున్నాడు. అందులో భాగంగా పద్నాలుగు వారాల్లో ఎలిమినేట్ అవుతూ వచ్చిన ప్రతీ కంటెస్టెంట్ ను తిరిగి హౌస్ లోకి తీసుకురానున్నారు. వీరు చేసే అల్లరితో నేటి ఎపిసోడ్ దద్దరిల్లనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమోను రిలీజ్ చేశారు.

ఇందులో పునర్నవి, రవి, మహేశ్‌, శివజ్యోతి, హిమజ, తమన్నా, శిల్పా చక్రవర్తి, హేమ జాఫర్‌, అషూ రెడ్డి, రోహిణి, వితిక బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందరు ఒకర్ని ఒకరు హత్తుకుని హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేదే లేదు అని చెప్పిన నటి హేమ కూడా మళ్లీ బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టడం విశేషం. ఇక శ్రీముఖి ఓవర్ యాక్షన్ తో హేమ కాళ్లు పట్టుకోబోయింది. వెంటనే వద్దు తల్లి అంటూ ఆమెకు ఓ నమస్కారం పెట్టి పక్కకు తప్పుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -