Thursday, April 25, 2024
- Advertisement -

వైసీపీలో చేరిన మ‌రో హీరో

- Advertisement -

ఎన్నిక‌ల వేళ పార్టీలు మారే నేత‌లు మ‌నం సాధార‌ణంగానే చూస్తునే ఉంటాం. ఇదే స‌మ‌యంలో వివిధ పార్టీల్లో చేరే సినీన‌టులను మ‌నం కూడా చూస్తునే ఉంటాం. ఏపీలో ఎన్నిక‌లు ద‌గ్గర ప‌డుతున్న కొద్ది ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీలోకి వ‌ల‌స‌లు బాగా పెరుగుతున్నాయి. రాజ‌కీయ నాయ‌కుల‌తో పాటు సినీ ప్ర‌ముఖులు కూడా వైసీపీలో చేరేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. తాజాగా మ‌రో హీరో వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న త‌నీష్‌, త‌రువాత హీరోగా మారి కొన్ని సినిమాల్లో న‌టించాడు. ఆ త‌రువాత తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ రెండో సీజన్‌లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తనీష్‌.

అలాంటి త‌నీష్ వైసీపీలో చేరి సంచ‌ల‌నం సృష్టించారు. ఆయ‌న వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైఎస్ఆర్‌సీపీలో చేరారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయంలో వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. తనీష్ కు పార్టీ కండువాకప్పి వైఎస్‌ జగన్‌ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా త‌నీష్ మీడియాతో మాట్లాడుతు వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం ఆనందంగా ఉందని హీరో తనీష్ అన్నారు. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు.

https://www.youtube.com/watch?v=1h62i4FaQz4

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -