Sunday, April 28, 2024
- Advertisement -

బిగ్ బాస్ లో ఆగని గొడవలు

- Advertisement -

బిగ్ బాస్ సీజన్ 3 మొదలై నెల పూర్తయ్యింది. కానీ హౌస్ మేట్స్ మధ్య గొడవలు మాత్రం పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. ఎంత పైకి గోడవైన తర్వాత కలిసినట్టు నటించినా లోపల మాత్రం అవే ఉంచుకుని వీలు చిక్కినప్పుడల్లా ఆ విషయాలు మళ్ళీ బయటికి తీస్తున్నారు ఇంటి సభ్యులు. తాజాగా నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన కంప్లైంట్ బాక్స్ టాస్క్ చూస్తేనే ఈ విషయం తెలుస్తోంది. ఇంతకుముందు అలీ రెజా, మహేష్ విట్టా ల మధ్య గొడవ అయింది. ఆ తర్వాత వాళ్ళు కలిసినట్టు ఉన్నారు కానీ మళ్ళీ కంప్లైంట్ బాక్స్ లో మాత్రం ఒకరిని ఒకరు నిందించుకున్నారు. మరోవైపు అషు రెడ్డి మరియు పునర్నవి భూపాలం కూడా మహేష్ అనవసర విషయాల్లో బాగా ఎక్కువగా తలా దూరుస్తున్నాడు అంటూ కంప్లైంట్ చేశారు.

మరోవైపు రాహుల్ సిప్లిగుంజ్ మరియు శ్రీముఖి ల మధ్య గొడవ ఇప్పటికీ అలానే నడుస్తోంది. ఇంతకు ముందు రాహుల్ శ్రీముఖి కి సారీ చెప్పినప్పుడు ఆమె తనకి కొంచెం టైం పడుతుంది కానీ క్షమిస్తాను అని చెప్పింది కానీ బిగ్బాస్ చూపించిన వీడియో తర్వాత మళ్లీ మారిపోయింది. మరోవైపు రాహుల్ శ్రీముఖి తో మాట్లాడుతూ మళ్ళీ గ్రామ ప్రజలు దొంగలు టాస్క్ గురించి ఎత్తగా శ్రీముఖికి కోపం వచ్చి తనని ఎప్పటికీ క్షమించను అని చెప్పేసింది. ఈ సారి రాహుల్, పునర్నవి, హిమజా, అషు రెడ్డి, బాబా భాస్కర్, మహేష్ శివజ్యోతి లు ఎలిమినేషన్ నామినేషన్స్ లో ఉన్నారు. మరి ఈ వారం ఎవరు ఇంటి నుంచి వెళ్ళిపోతున్నారు ఇంకా తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -