ప్రముఖ నటి సమంత ఓ నెటిజన్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన దుస్తులపై వల్గర్గా స్పందించిన ఓ నెటిజన్పై తీవ్ర స్థాయిలో మండిపడింది సామ్. ఆలోచనా తీరు మార్చుకోవాలని సూచించింది. తాను ఏ దుస్తులు వేసుకుంటే ఏంటని, వేషధారణను బట్టి మహిళను అంచనా వేయటం సరికాదని హితబోధ చేసింది. ముంబయిలో జరిగిన ‘క్రిటిక్స్ ఛాయిస్’ అవార్డ్స్ ఫంక్షన్లో మెరిసింది సమంత. ఈ షోలో ఆమె రూ.2లక్షల ఖరీదు చేసే గ్రీన్ కలర్ లాంగ్ వెస్ట్రన్ ఫ్రాక్తో సందడి చేసింది. ఆ ఫొటోలను ఇన్స్టా అకౌంట్లో అభిమానులతో పంచుకుంది. పలువురు నెటిజన్లు ఆమె దుస్తుల డిజైన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విడాకుల అనంతరం సామ్ కొత్తగా ప్రవర్తిస్తోందని నెగెటివ్ కామెంట్స్ చేశారు. అయితే సమంత ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది. “ఎదుటివారిపై ఓ అభిప్రాయానికి రావాలంటే.. ఏయే విషయాలు పరిగణనలోకి తీసుకోవాలనేది.. ఓ మహిళగా అవగాహన ఉంది. కానీ, ఇప్పుడు మనం.. దుస్తులు, శరీరపు ఛాయ, చదువు.. ఇలా ఎన్నో అంశాల ఆధారంగా మహిళలపై ఓ నిర్ణయానికి వస్తున్నాం.
ఒక మనిషి ధరించిన దుస్తుల్ని బట్టి వారిని జడ్జ్ చేయడం ఎంతో తేలిక. ప్రస్తుతం మనం 2022లో ఉన్నాం. మహిళలు ధరించిన దుస్తుల్ని బట్టి వాళ్ల క్యారెక్టర్ని నిర్ణయించడం ఇకనైనా మానుకోవాలి. మన వ్యక్తిగత అభిప్రాయాలను వేరొకరి మీద రుద్దడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.” అని సమంత తన పోస్ట్లో రాసుకొచ్చింది.