Tuesday, April 30, 2024
- Advertisement -

అరవింద సెన్సార్…….ఫైట్స్ కాదు….అంతకుమించిన హైలైట్స్ ఏంటంటే?

- Advertisement -

అజ్ఙాతవాసి ఫలితం తర్వాత కచ్చితంగా మళ్ళీ బాక్స్ ఆఫీస్ బ్యాంగ్ లాంటి బ్లాక్ బస్టర్…….అది కూడా తన స్థాయిని పెంచే రేంజ్ సక్సెస్ కోసం త్రివిక్రమ్‌ కసితో పనిచేసిన సినిమా అరవింద సమేత. ఈ సినిమాతో తన గౌరవం కూడా పెరుగుతుందని త్రివిక్రమ్ చెప్తున్నాడు. ఇక ఎన్టీఆర్ అయితే కంప్లీట్‌గా త్రివిక్రమ్ జడ్జ్‌మెంట్‌కి తగ్గట్టుగా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఇప్పటి వరకూ అభిమానులతో పాటు టీజర్, ట్రైలర్ చూసినవాళ్ళందరూ కూడా ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ సూపర్ హైలైట్ అవుతాయని అనుకుంటున్నారు.

అయితే తాజాగా సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన హైలైట్స్ విషయంలో సెన్సార్ బోర్డ్ మెంబర్స్ మాత్రం కొన్ని షాకింగ్ విషయాలు చెప్పారు. నిజానికి ఈ సినిమాలో హైలైట్ యాక్షన్ ఎపిసోడ్స్ కాదు. యాక్షన్ ఎపిసోడ్స్‌పైన త్రివిక్రమ్, ఎన్టీఆర్‌లు ఆధారపడలేదని తెలుస్తోంది. రాయలసీమ ఫ్యాక్షనిజం కావొచ్చు, ఇంకేవైనా హత్యలు, ప్రతీకారాలు కావొచ్చు…………అంతిమంగా నష్టపోయేది ఇంట్లో ఉండే మహిళలే. నమ్ముకుని వచ్చిన భార్య జీవితాన్ని మోడు చేస్తూ ఆవేశంగా హింసికు పోవడం అతి పెద్ద నేరం అనే దిశగా ఈ సినిమాను నడిపించాడు త్రివిక్రమ్. సినిమా అంతా కూడా ఈ మెస్సేజ్ చుట్టూనే నడుస్తుందని సెన్సార్ బోర్డ్ మెంబర్స్ చెప్తున్నారు. సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ ఇదేనని……….ఈ ఎమోషన్ ఓ స్థాయిలో ఆకట్టుకుంటుందని ………..త్రివిక్రమ్‌ పెన్ పవర్‌కి తిరుగేలేదు అనే స్థాయిలో ఈ సీన్స్‌లో డైలాగులు ఉన్నాయని సెన్సార్ మెంబర్స్ చెప్తున్నారు. ఇక పూజా హెగ్డే క్యారెక్టర్‌కి అంతగా ఇంపార్టెన్స్ లేదని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే నమ్ముకుని వచ్చిన భార్యకంటే హింస, ప్రతీకారాలు ముఖ్యమా అన్న మెస్సేజ్ చుట్టూ తిరిగే ఈ సినిమాకు ఆ ఎమోషనే ప్రాణం పోయనుంది. అలాంటి ఎమోషనల్ సీన్స్‌లో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ కంటితడిపెట్టించడం ఖాయం అనే రేంజ్‌లో ఉందట. ఈ ఎమోషనల్ ఎపిసోడ్ కనెక్ట్ అయినవాళ్ళందరికీ కూడా సినిమా కొన్నాళ్ళపాటు వెంటాడే స్థాయిలో ఉంటుందట. ఇప్పుడు ఈ అంశమే అరవింద సమేత సినిమాపై పాజిటివ్ టాక్‌ని ఇంకాస్త పెంచుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -