Saturday, May 4, 2024
- Advertisement -

దగ్గుబాటి బందువులతో చైసామ్

- Advertisement -

టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ … అక్కినేని చైతన్య, సమంతాలు. మ్యారీజ్ తర్వాత వీరిద్దరు ప్రతి మూమెంట్ ని ఓ పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇద్దరు తమతమ ట్రెడిషన్స్ ను గౌరవించి ఏకంగా రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు. ఎట్ ప్రజెంట్ ఈ జంట ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్నారు. మరీ ముఖ్యంగా సమంత చాలా పాజిటివ్ గా చిరునవ్వుతో అక్కినేని సమంత అని అందరినీ పరిచయం చేసుకుంటోంది.

వీరిద్దరి పెళ్లి వేడుకలు గోవాలో క్రిస్టియన్ – హిందూ పద్ధతుల్లో జరిగిన విషయం మనకు తెలిసిందే. త్వరలో నాగార్జున హైదరాబాద్ లో అందరికి రిసెప్షన్ ఇస్తానని చెప్పాడు. అయితే ఈ లోపు ఈజంట నాగ చైతన్య తల్లి… లక్షి తన పుట్టింటి వారి సమక్షంలో కొడుకుకి చిన్న రిసిప్షన్ పార్టీని ఏర్పాటు చేయబోతోంది. లక్ష్మి అంటే దగ్గుబాటి సురేష్ ,వెంకటేష్ సోదరి. ఈ వేడుకను చైతు మేన మామ దగ్గుబాటి సురేష్ బాబు ఎంతో ఘనంగా చేయడానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.

ఈ పార్టీలో వెంకీ- రానాతో పాటు దగ్గరి బంధువులు మాత్రమే పాల్గొంటారు. నెల్లూరు – కారంచేడు అలాగే రాజమండ్రి నుండి దగ్గుబాటి దగ్గరి బంధువులు రాబోతున్నారు. అలాగే సురేష్ బాబు మామగారైన తణుకు పట్టణానికి చెందిన నారాయణరావుగారి ఫ్యామిలీ కూడా ఈ ఈవెంట్ కు రాబోతోంది. ఈ పార్టీ ప్రయివేట్ గా ఫ్యామిలీ మెంబర్స్ కోసం మాత్రమే ఏర్పాటు చేస్తున్నారట. మరి ఈ పార్టీ తాలుకు విశేషాలు మీడియాలో వస్తాయో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -