Wednesday, May 15, 2024
- Advertisement -

మహేశ్, చరణ్.. ఆ సబ్జెక్ట్ ను ఎవరు సొంతం చేసుకొంటారో!

- Advertisement -

సూపర్ హిట్ అనిపించుకొన్న తమిళ సినిమా తనీ ఒరువన్ రీమేక్ విషయంలో పోటీ క్రమంగా ఎక్కువ అవుతోంది.

ఈ తమిళ సినిమాను రీమేక్ చేయడానికి అనేక భాషల్లో అనేక మంది ముందుకు వస్తున్నారు. హిందీలో ఈ సినిమాను సల్మాన్ ఖాన్ రీమేక్ చేసే అవకాశాలున్నాయని వార్తలు వస్తుండగా.. కన్నడలో పునీత్ రాజ్ కుమార్ ఖాయం అయ్యాడు. అయితే తెలుగులోనే ఇంకా ఒక క్లారిటీ రావడం లేదు. ఈ రీమేక్ సబ్జెక్టుపై ఇద్దరు పెద్ద హీరోలు కన్నేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. 

వాటిలో ఒకరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాగా, రెండో వ్యక్తి ప్రిన్స్ మహేశ్ బాబు. ఈ ఇద్దరు స్టార్ హీరోలూ తనీ ఒరువన్ సినిమాను చూసి ఫ్లాట్ అయ్యారట. ఈ సినిమా రీమేక్ చేసే ఆసక్తితో ఉన్నారట విశేషం ఏమిటంటే.. ఈ హీరోలిద్దరూ రీమేక్ సబ్జెక్టులపై అంత ఆసక్తి ఉన్నవాళ్లు కాదు. మహేశ్ ఇంత వరకూ ఎప్పుడూ రీమేక్ ల జోలికే పోలేదు. ఇక చరణ్ కూడా జంజీర్ రీమేక్ మాత్రమే చేశాడు. అది కూడా ప్లాఫ్. ఆ తర్వాత ఎప్పుడూ రీమేక్ ల జోలికి పోకూడదని చరణ్ ఫిక్సయ్యాడు.

మరి ఇప్పుడు జయం రవి హీరోగా వచ్చిన తమిళ సినిమావిషయంలో మాత్రం ఈ ఇద్దరు హీరోలూ తమ గత చరిత్రను, అభిప్రాయాలను పక్కన పెట్టారని తెలుస్తోంది. వీలైతే ఈ సినిమాను రీమేక్ చేయడానికి ఆసక్తితోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో వీరిద్దరూ ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. మరి ఇద్దరు స్టార్ హీరోల్లో ఈ తమిళ సినిమాపై హక్కులను ఎవరు సొంతం చేసుకొంటారో.. తనీ ఒరువన్ తెలుగు వెర్షన్ లో ఎవరు కనిపిస్తారో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -