Monday, May 6, 2024
- Advertisement -

హీరోయిన్లు ఎలాంటి బట్టలు వేసుకోవాలో కూడా ఛార్మి నే చెప్పేస్తోందట

- Advertisement -

టాలీవుడ్లో ఒకప్పుడు హీరోయిన్ గా నటించి తర్వాత నిర్మాతగా సెటిల్ అయిన వారిలో ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో ఛార్మింగ్ బ్యూటీ ఛార్మీ కూడా ఒకరు. ఒకప్పుడు హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుని ప్రస్తుతం పూరీ జగన్నాథ్ నిర్మాణ సంస్థ పనులను దగ్గరుండి చూసుకుంటోంది ఛార్మి. తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా కి కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ మరియు నభ నటేష్ లు హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.

అయితే ప్రమోషన్ల సమయంలో కూడా హీరోయిన్లు ఎలాంటి దుస్తులు వేసుకోవాలి అని చార్మి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే సినిమా ప్రమోషనల్ ఈవెంట్ ఒకటి గుంటూరులోని ఇంజనీరింగ్ కాలేజ్ లో జరిగింది. మామూలుగా అయితే ఇలాంటి ఈవెంట్లకు వచ్చేటప్పుడు హీరోయిన్లు మామూలు దుస్తుల్లో వస్తారు కానీ నిన్న నిధి మరియు నభ తమ హాట్ అవతారాల్లో అందరికీ షాక్ ఇచ్చారు. వారు అలాంటి బట్టలు వేసుకోవడానికి కారణం చార్మీ అని సమాచారం. నిజానికి బాలీవుడ్ లో నిర్మాత ఏక్తాకపూర్ కూడా ఇలానే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. చూస్తూ ఉంటే ఛార్మి ఏక్తా కి టాలీవుడ్ వెర్షన్ లా మారిపోయినట్లు కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -