Sunday, April 28, 2024
- Advertisement -

మెగాస్టార్ పూరీ కాంబినేషన్ ఫిక్స్..!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్ గా పేరు గాంచిన పూరీ జగన్నాథ్ కు ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఈ మద్య పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ప్రతి మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్స్ అవుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేసిన టెంపర్ మూవీ తరువాత పూరీ డైరెక్షన్ లో వచ్చిన ఇజం, మెహబూబా, ఘోరంగా నిరాశ పరచగా, మద్యలో ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని తో తీసిన ” ఇస్మార్ట్ శంకర్ ” మూవీ కాస్త పరవలేదనిపించింది.

ఇక ఆ తరువాత వచ్చిన రొమాంటిక్ మూవీ మళ్ళీ ఫ్లాప్ ల బాటా పట్టాడు పూరీ జగన్నాథ్.. ఇక ఇటీవల వచ్చిన లైగర్ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్ కావడంతో.. పూరీ డైరెక్షన్ లో నటించేందుకు ప్రస్తుతం ఏ స్టార్ హీరో కూడా ఆసక్తి చూపడం లేదు. అంతే కాకుండా లైగర్ మూవీ ఫైనాన్సియల్ పరంగా భారీ నష్టాలను తీసుకురావడంతో ఆ నష్టాలను భర్తీ చేయాలంటే పూరీ మళ్ళీ స్ట్రాంగ్ గా కామ్ బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది.

అంత షాక్ నుంచి పూరీ త్వరగానే కోలుకొని మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. గతంలో చిరంజీవితో ‘ఆటోజాని’ చేయాలనుకున్నా కుదరలేదు. ఆ తరువాత చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో పూరి జర్నలిస్ట్ పాత్రను చేశాడు. ఆ మధ్య చిరంజీవి ‘ఆటోజాని’ గురించి ప్రస్తావిస్తే, అంతకంటే మంచి కథతో వస్తానని పూరి చెప్పాడట. అప్పుడు చిరంజీవి వెయిట్ చేస్తూ ఉంటానని అన్నారు.

అయితే చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ ఈ నెల 13వ తేదీన థియేటర్లకు రానుంది. ప్రస్తుతం చిరంజీవి ‘భోళా శంకర్’ కు ఓకే చేసారు. తరువాత మరో ప్రాజెక్టును మెగాస్టార్ ఒప్పుకోలేదు. అందుకు కారణం పూరితో చేయాలనీ ఆయన ఫిక్స్ కావడమే అనే టాక్ వినిపిస్తోంది. అందుకు సంబంధించిన కథపైనే పూరి కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. ఈ ఏడాదిలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళుతుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

లోకేశ్ కోసం తెలుగు హీరోలు వెయిటింగ్!

భారీ బయోపిక్ ను రిజక్ట్ చేసిన మహేశ్..!

మహేశ్ రాజమౌళి స్టోరీ అదేనట.. రాజమౌళి క్లారిటీ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -