Tuesday, May 28, 2024
- Advertisement -

చార్మి తొలి సినిమాతోనే లాభాలు సంపాదించేస్తోంది!

- Advertisement -

ఈ మధ్యకాలంలో హీరోలు, హీరోయిన్లు వరసగా నిర్మాతలుగా మారేస్తున్నారు. టాలీవుడ్ లో హీరోలు నిర్మాతలుగా మారుతున్న ట్రెండ్ నడుస్తోంది. మహేశ్ బాబు వంటి హీరో కూడా నిర్మాతగా మారిపోయాడు. ఇక బాలీవుడ్ లో అనుష్కశర్మ వంటి హీరోయిన్ నిర్మాతగా మారింది. తాజాగా టాలీవుడ్ లో చార్మి ఇలాంటి ఫీట్ ను చేసింది. తనే ప్రధాన పాత్రలో నటించిన సినిమాను ఆమె ప్రొడ్యూస్ చేసింది.

మరి తొలి సినిమానే చార్మికు సానుకూల అనుభవాన్ని మిగిల్చినట్టుగా తెలుస్తోంది. “జ్యోతిలక్ష్మి’ సినిమా హిట్ అయినట్టుగాట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ప్రాఫిట్స్ లోకి వచ్చేసినట్టేనని తెలుస్తోంది. పూరీ గత సినిమా ‘టెంపర్’ సూపర్ హిట్ అయి ఉండటం.. చార్మి గ్లామర్ కు మంచి క్రేజ్ ఉండటం ఈ సినిమాకు పాజిటివ్ అయ్యింది. ఇక కథాంశం కూడా మాస్ కు ఎక్కేలా ఉంది. దీంతో బీ, సీ సెంటర్స్ లో సినిమా వర్కవుట్ అయ్యిందని తెలుస్తోంది.

ఇక ఇదే వారం విడుదల అయిన కేరింత కొంత వరకూ పర్వాలేదనిపించుకొంది. వరుణ్ సందేశ్ సినిమా ‘లవకుశ’ మాత్రం ఎవరికీ పట్టకుండా పోయింది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ అంటూ ప్రచారం చేసినా.. ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను థియేటర్ల వరకూ రప్పించలేకపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -