Friday, April 26, 2024
- Advertisement -

ప్రభుదేవాతో నాకు ఏ గొడవలు లేవు : ఎమ్మెస్ రాజు

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరు ఎమ్మెస్ రాజు. విక్టరీ వెంకటేష్ హీరోగా విజయశాంతి హీరోయిన్ గా తెరకెక్కిన ‘శత్రువు’ నిర్మాతగా ఎమ్మెస్ రాజుకి మొదటి చిత్రం. ఆ తరువాత ఆయన నిర్మించిన ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’ మూవీస్ భారీ వసూళ్లు రాబట్టాయి. దాంతో ఆయన స్టార్ ప్రొడ్యూసర్స్ లీస్ట్ లో చేరిపోయారు. ఇక ‘ఒక్కడు’ గుణ శేఖర్ -మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది.

ఆ తరువాత ఆయన ప్రభాస్ హీరోగా ‘వర్షం’ సినిమాను నిర్మించారు. తన కెరియర్లో తనకి బాగా ఇష్టమైన సినిమా ‘వర్షం’ అని ప్రభాస్ ఇప్పటికీ చెబుతుండటం, ఈ సినిమా ప్రత్యేకతను చాటి చెబుతుంది. కాకపోతే ఈ చిత్రం అనుకున్నంత విజయం మాత్రం సాధించలేదు. ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ‘వర్షం’ ప్రభాస్ ఫ్యాన్స్ ని నిరాశ పరిచింది.

దాంతో ఈ ప్రభావం నిర్మాత పై కూడా పడింది. దాంతో దర్శకుడు ప్రభుదేవతో నిర్మాత ఎమ్మెస్ రాజు కి గొడవలు జరిగాయని.. అప్పట్లో టాక్ వచ్చింది. ఇప్పటికీ అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ టాక్ వస్తూనే ఉంది. తాజాగా ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ.. నిజమే అప్పట్లో ఆ టాక్ వచ్చింది .. కానీ అందులో నిజం లేదు. ప్రభుదేవతో ఇప్పటికీ నాకు మంచి సంబంధాలు ఉన్నాయని.. ఎక్కడ కలిసినా అప్యాయంగా మాట్లాడుకుంటాం అని అన్నారు.

ఉత్కంఠ రేపుతున్న ‘క‌ప‌ట‌నాట‌క సూత్ర‌ధారి’ట్రైల‌ర్

హైవే హత్యల కేసులో 12 మందికి ఉరిశిక్ష‌.. ఒంగోలు ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు..

భర్త చెంప చెళ్లుమనిపించిన నటి.. వైరల్ వీడియో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -