Wednesday, May 15, 2024
- Advertisement -

ఆచార్య లో మహేశ్ ఉన్నాడో లేదో చెప్పిన చిరు..!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నారన్న వార్తలు టాలీవుడ్ లో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మధ్యలో మహేశ్ స్థానంలో రామ్ చరణ్ నటిస్తున్నారని.. కాదు, అల్లు అర్జున్ ఆ అవకాశాన్ని అందుకున్నాడని రూమర్స్ వచ్చాయి. అయితే వీటిపై కూడా చిత్ర యూనిట్ స్పందించలేదు.

తాజాగా, ఓ ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన చిరంజీవి, తనతో పాటు మహేశ్ నటిస్తున్నారన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు. అసలు ‘ఆచార్య’ చిత్రంలో మహేశ్ బాబు నటించనున్నారన్న వార్త ఏ విధంగా పుట్టిందో తనకు తెలియదన్నారు. మహేశ్ బాబు ఓ అద్భుతమైన నటుడు. మహేశ్ ను నేను చాలా గౌరవిస్తాను. మహేశ్ కూడా నన్ను అంతే ప్రేమిస్తారు. అతను నాకు కొడుకు వంటివాడు. భవిష్యత్తులో అతనితో కలిసి నటించే అవకాశం వస్తే, తప్పకుండా చేస్తాను.

కానీ ఈ చిత్రంలో నటించాలని ఆయన్ను సంప్రదించలేదు. ఈ వార్తలన్నీ పుకార్లే” అని చిరు అన్నారు. ఇక ఈ చిత్రంలో ఓ పాత్ర కోసం చరణ్ తో చేయించాలని కొరటాల ముందు నుంచి అనుకుంటున్నారని.. అయితే చరణ్ రాజమౌళి సినిమాలో బిజీగా ఉండం వల్ల చరణ్ కి డేట్స్ కుదరడం లేదని చరణ్ చెప్పినట్లు చిరు వ్యాఖ్యానించారు. ఈ విషయలో కొరటాల, రాజమౌళి, చరణ్ చర్చించుకుని ఓ నిర్ణయానికి వస్తే, రామ్ చరణ్ సినిమాలో కనిపించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -