మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి.స్వాతంత్య్రోద్యమకారుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను సైరా మూవీగా తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం సినిమా క్లైమాక్స్ చేరుకుందని తెలుస్తుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిను బంధించడానికి బ్రిటిష్ సైన్యం యుద్ధం చేయడం దాన్ని నరసింహారెడ్డి సైన్యం ఎదుర్కోవడం సినిమాలో ప్రధానమైన ఘట్టం. దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో సీన్స్ ను చిత్రీకరించారు. ఐదుగురు హాలీవుడ్ ఫైట్ కొరియోగ్రాఫర్లతో పాటు టాప్ క్లాస్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు – సురేందర్ రెడ్డి అండ్ టీమ్ కష్టపడిన విధానం వర్ణనాతీతమని చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. సినిమాకోసం రత్నవేలు భారీ కెమెరా ఎక్విప్ మెంట్ – స్పెషల్ క్రేన్లను తయారుచేయించాడు. యుద్ధ సన్నివేశాలు కళ్లకుకట్టినట్లుగా ఒక యాక్షన్ ఫీల్ ను రప్పించే విధంగా షూట్ చేశారట.
క్లైమాక్స్ లో థియేటర్ దద్దరిల్లడం కాయమని తెలుస్తోంది. ఇక వీరుపడిన కష్టానికి తగిన ఫలితం రావాలంటే అంతా విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ చేతిలో ఉందని చెప్పాలి.గ్రాఫిక్స్ వర్కౌట్ అయితే సైరాని అడ్డుకోవడం ఎవరితరం కాదు. మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఆగాల్సిందే. కొణిదెల ప్రొడక్షన్ పై రామ్ చరణ్ సినిమాను 200కోట్లతో సినిమాను నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ – సుదీప్ – విజయ్ సేతుపతి మరియు జగపతి బాబు వంటి వారు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు.