Thursday, May 2, 2024
- Advertisement -

మంత్రి పువ్వాడ ఇంటికి మెగా హీరోలు!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రమఖ దర్శకులు కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం లో రామ్ చరణ్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మే 13న విడుద‌ల కానున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శ‌ర‌వేగ‌గంగా జ‌రుగుతుంది. గ‌త షెడ్యూల్‌ను మారేడుమిల్లిలో పూర్తి చేసిన చిత్ర బృందం ఇప్పుడు ఇల్లెందు ఓపెన్ కాస్ట్‌లో షూటింగ్ జ‌రుపుతుంది.

తాజా షెడ్యూల్ ఈ నెల 11 వ‌ర‌కు ఉంటుంద‌ట‌. మొద‌టి రోజు భద్రాద్రి జిల్లాలోని ఇల్లెందు జేకే 5 ఓపెన్‌కాస్టులో ‘ఆచార్య’ సినిమా క్లైమాక్స్‌‌ సీన్ చిత్రీక‌రించారు. ఈ నేపథ్యంలో చిరంజీవితో పాటు రామ్ చ‌ర‌ణ్‌ల‌కు వారం రోజుల పాటు ఆతిథ్యం ఇచ్చారు మంత్రి పువ్వాడ అజ‌య్. ఈ నేపథ్యంలో పువ్వాడ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ.. ఆచార్య చిత్రం కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఎంపిక చేయడం సంతోషకరం అని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు పువ్వాడ‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -