తెలుగు ప్రముఖ కమెడియన్స్లో అలీ కూడా ఒకరు. తన కామెడీతో చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు అలీ. హీరోగా కూడా కొన్ని సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి అలాంటి వ్యక్తి ఎంత హుందాగా నటించాలి. కాని అలీ ఎప్పుడు తన వ్యాఖ్యలతో వివాదాలు సృష్టిస్తున్నాడు. తోటి నటీ,నటులు,యాంకర్స్పై అలీ డబుల్ మీనింగ్ డైలాగులు వాడుతు తీవ్ర విమర్శలను ఫేస్ చేస్తున్నాడు.
తాజాగా అలీ యాంకర్ అనసూయపై ఓ కవిత చెప్పి మరోసారి వార్తల్లో నిలిచాడు. అనసూయ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మాత్తగా కనిపిం అనసూయకు అవార్డులు కూడా దక్కుతున్నారు. ఇటీవల జరిగిన జీ అవార్డుల కార్యక్రమంలో ఆమె ఉత్తమ సహాయనటి కేటగిరీలో అవార్డు దక్కించుకుంది. ఈ సందర్భంగా స్టేజ్పైకి వచ్చిన అనసూయకి కమెడియన్ అలీ ఓ కవిత చదివి వినిపించాడు.
”ఆడదానికే అందం నీ అందం
నెలవంక లాంటి నీ నుదుట కుంకుమ అందం
నీ సోగ కనులకు కాటుక అందం
నీ సొట్టబుగ్గలకు సిగ్గు అందం
నీ అధరాలకు చిరునవ్వు అందం
నీ ఒంపుసొంపులకు చీరకట్టు అందం
ఆ వన్నెలన్నీ నువ్వైతే నింగి అంత అందం”
అంటూ ఓ కవిత చదివాడు అలీ. అయితే ఇది అలీ రాసిన కవిత కాదులేండి. ఎవరో అభిమాని అనసూయ కోసం రాసిన కవితను ఆమె కోసం ఇదిగో ఇలా స్టేజీ మీద చదివాడు అలీ. ఈ కవిత సరదాగా ఉన్నప్పటికి అలీ చదవడంతో ఇది కూడా ఎక్కడ వివాదం అవుతుందో అని తెగ బాధపడిపోతున్నారు అనసూయ అభిమానులు.