Sunday, May 5, 2024
- Advertisement -

రెమ్యూనరేషన్ ఎగ్గొట్టిన పాపులర్ దర్శకుడు

- Advertisement -

ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తాజాగా విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను చేసుకుంటుంది. వరుస డిజాస్టర్లని చవిచూసిన పూరీ జగన్నాథ్ ఎట్టకేలకు ఒక మంచి హిట్ ను అందుకున్నాడు అని, పూరి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడని అభిమానులు ఆనందిస్తున్నారు. మొదటి వారాంతం రాకుండానే సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది. నిజానికి పూరి జగన్నాథ్ సినిమా విడుదలకు ముందు బయర్లని ముందుకు తీసుకురావడానికి చాలా సమయం పట్టింది. కానీ ఆఖరి నిమిషం దాకా కష్టపడి ఎలాగోలా సినిమాని రిలీజ్ చేశాడు పూరి. అయితే రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ప్రస్తుతం పూరి పై షాకింగ్ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిజానికి రామ్ కి 5 కోట్లు ఇస్తానని చెప్పిన పూరి జగన్నాథ్ కేవలం 2.5 కోట్లను అడ్వాన్స్ గా ఇచ్చాడు. ఇంకా పెండింగ్ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో రామ్ సినిమా విడుదలయ్యాక ప్రమోషన్లలో పాల్గొనడం లేదు. మరోవైపు సంగీత దర్శకుడు మణిశర్మ మరియు ఇతర కాస్ట్ అండ్ క్రూ కూడా వద్ద కూడా ఇస్తాను డబ్బులు ఇవ్వకపోవడంతో చిత్ర బృందం పూరి జగన్నాథ్ పై మండి పడుతోంది. అంతేకాకుండా సినిమా విడుదలయ్యాక నిర్మాత ఛార్మి కూడా చాలా కొత్తగా మారిపోయిందని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో రామ్ కుటుంబం నుంచి స్రవంతి రవికిషోర్ ఈ విషయాన్ని డీల్ చేయడానికి ముందుకు వచ్చారట. ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ తిరిగి ఇవ్వకపోతే ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కంప్లైంట్ నమోదు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -