Thursday, April 25, 2024
- Advertisement -

డైరెక్టర్ క్రిష్ కి కరోనా!

- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతగా విజృంభిస్తుందో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. కోట్ల మంది ఈ కరోనా భారిన పడ్డారు. ప్రాణ నష్టమే కాదు.. ఆర్థిక నష్టం ఘోరంగా వాటిల్లుతుంది. ఈ మద్య టాలీవుడ్ లో సైతం కరోనా కేసులు బాగానే పెరిగిపోతున్నాయి. మెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు కి కరోనా వచ్చి పోయింది. ఈ మద్య రామ్ చరణ్ కి కరోనా వచ్చినట్టు తెలిపాడు.. ఆ తర్వాత నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కి కరోనా వచ్చింది.

తాజాగా ప్రముఖ దర్శకుడు క్రిష్ కరోనా బారిన పడ్డాడు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో అతడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. పవన్ కల్యాణ్ సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ పెట్టుకున్నాడు క్రిష్. షూటింగ్ జరపాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కరోనా పరీక్షలు చేయించుకోవాలి.

తనకు పాజిటివ్ వచ్చినంతవరకు కరోనా ఉందేన విషయం క్రిష్ కు తెలియలేదు. తనకు అసలు కరోనా లక్షణాలు ఏవీ లేకున్నా కరోనా పాజిటీవ్ రావడం ఆశ్చర్యమని.. అందరూ కరోనా విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

టాలీవుడ్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ ఇవే..!

నటి ప్రియ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు..!

టాలీవుడ్ స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..!

హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -