బాలీవుడ్ హాట్ పెయిర్ దీపిక పదుకోన్, రణవీర్లు పెళ్లికి రెడీ అయిన సంగతి తెలిసిందే.వీరిద్దరి వివాహం ఇటలీలోని లేక్ కోమోలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనుంది.ఇప్పటికే దీపిక, రణవీర్ లతో పాటు వారి సన్నిహితులు, బంధువులు, కొందరు సింగర్స్ ఇటలీ చేరుకున్నారు.ఎంతో వైభవంగా వీరి వివాహ వేడుక జరగనుంది. ఇటలీలో ఈ జంట పెళ్లికి వేదికైన విల్లా డెల్ బాల్బినెల్లో సర్వాంగ సుందరంగా సిద్ధం చేస్తున్నారు. సింధ్, హిందూ సంప్రదాయాల పద్దతుల్లో వీరి వివాహం జరగనుంది.
పెళ్లి మండపాన్ని అలంకరించడానికి పన్నెండు మంది పుష్పాలంకరణ నిపుణులను రప్పించారని తెలుస్తోంది. పెళ్లికి వచ్చిన వారందరికీ బ్లెవియా విలేజ్ లో ఉన్న రిసార్ట్ అంతటినీ బుక్ చేశారు. ఈ రిసార్ట్ లో నాలుగు రెస్టారంట్లు, బార్లు, స్పా, స్విమ్మింగ్ పూల్తో పాటు ఎంజాయ్ చేయడానికి అన్ని వసతులు ఉన్నాయి.ఈ రిసార్ట్లో ఒక్కో రూమ్ ఖరీద్ వచ్చేసరికి రూ.33 వేలు వరకు చార్జ్ చేస్తారని తెలుస్తోంది. దీపిక పదుకోన్, రణవీర్ల పెళ్లి కోసం మొత్తం 75 రూమ్ లను బుక్ చేశారట. ఈ లెక్కన ఈ రిసార్ట్కి రోజుకి వచ్చి 25 లక్షలు చెల్లిస్తున్నారట ఈ జంట.ఈ విషయం తెలిసిన బాలీవుడ్ జనాలు దీపిక పదుకోన్, రణవీర్ల పెళ్లి చాలా కాస్టిలీ గురు అని చర్చించుకుంటున్నారు.