- Advertisement -
బాలీవుడ్ మాజీ ప్రేమ జంట రణ్బీర్ కపూర్, దీపికా పదుకొణె కలిసిపోయారు. అయితే ఇది నిజ జీవితంలో కాదు, సినిమా షూటింగ్లోను కాదు, మరి ఎక్కడ అనుకుంటున్నారా! ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా నిర్వహిస్తున్న ఫ్యాషన్ షో కోసం ఏప్రిల్ 9న ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్లో జరిగే ఫ్యాషన్ షోలో మిజ్వాన్ అనే ఎన్జీవోకు చెందిన ఎంబ్రాయిడరీ కళాకారులు రూపొందించిన దుస్తులు ధరించి వీరు ర్యాంప్ వాక్ చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడం తనకెంతో సంతోషంగా ఉందని రణ్బీర్ చెప్పాడు.గతంలో అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, రణ్వీర్ సింగ్, సిద్ధార్థ్ మల్హోత్రా, ప్రియాంక చోప్రా, శ్రద్ధా కపూర్ కూడా ఫ్యాషన్ షోలో పాల్గొని తమ వంతు సాయం చేశారు.