బాహుబలి సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్ జాతీయ స్థాయికి ఎదిగాడు. ఎక్కడ చూసినా ప్రభాస్ను బాహుబలి అనేస్తున్నారు. ఆ సినిమా తర్వాత ప్రభాస్ సాహో చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత బాలీవుడ్లో ఓ సినిమా చేయనున్నాడు. వచ్చే సంవత్సరం తన బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని ప్రభాస్ ఇప్పటికే ప్రకటించాడు.
మూడేళ్ల కిందటే ఓ ప్రేమకథకు అంగీకరించాడు. సాహో సినిమా పూర్తయిన తర్వాత మిగతా వివరాలు వెల్లడిస్తానని గతంలో తెలిపారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ పక్కన ఎవరూ నటిస్తారని సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. ప్రభాస్ హైట్కు.. సరిజోడి ఎవరా అని చిత్రబృందం బుర్ర పెట్టి ఆలోచించి చివరికి ఒకరిని ఎంపిక చేసుకున్నారని టాక్. పద్మావత్ సినిమాతో బిజీగా ఉన్న దీపిక పదుకునేను ప్రభాస్ సినిమాలో ఎంపిక చేద్దామని డిసైడైనట్టు సమాచారం.
ఒకవేళ దీపిక పదుకునె ఒప్పుకోకపోతే.. అలియా భట్ లేదా కత్రినా కైఫ్ను సంప్రదిస్తారట. దీనిపై స్పందించడానికి ప్రభాస్ అందుబాటులో లేడు. ప్రస్తుతం అతడు సాహో షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమాలో బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ నటిస్తున్నది తెలిసిందే. ఈ సమయంలో అవే సత్సంబంధాలు కొనసాగించి దీపికతో ప్రేమాయణం చేసే అవకాశం ఉంటుంది.
‘సాహో’ సినిమాకు సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. యాక్షన్కు ప్రాధాన్యం ఇస్తూ తీస్తున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ నిపుణులు పనిచేస్తున్నారు.
దీంతోపాటు దీపిక ప్రధాన పాత్రలో నటించిన ‘పద్మావత్’ సినిమా జనవరి 25వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా తర్వాత దీపిక మరోసారి భన్సాలీ దర్శకత్వంలో నటించనున్నారని ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. ఏదైతే ఏమి ప్రభాస్ సరసన దీపికను ఊహించుకుంటే ఎంత బాగుంటుందో.