Thursday, April 25, 2024
- Advertisement -

బెంగళూరు చేరుకున్న కొత్త జంట.. దేనికో తెలుసా?

- Advertisement -

బాలీవుడ్ కొత్త జంట దీపికా పదుకోన్, రణ్‌వీర్‌ సింగ్‌లు మంగ‌ళ‌వారం సాయంత్రం బెంగళూరు చేరుకున్నారు.ఇటలీలో చేసుకున్న పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఒకేసారి కాకుండా కొన్ని కొన్నిగా రిలీజ్‌ చేస్తున్నారు. నిజానికి ఈ జోడీ అధికారికంగా పెళ్లి ఫొటోలు విడుదల చేసేవరకూ ఒక్క ఫొటో కూడా బయటికి రాలేదు. అంత సెక్యూర్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు తమంతట తాము ‘ఫొటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమరీస్‌’ అన్నట్లు సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేస్తున్నారు.

మెహందీ వేడుక అప్పుడు దిగిన ఫొటోలు, పెళ్లిలో దీపికా నుదుట రణ్‌వీర్‌ బొట్టు పెడుతుంటే, భర్తకు ఆమె పెడుతున్న ఫొటో, ఆత్మీయంగా రణ్‌వీర్‌కి దీపిక తినిపిస్తున్న ఫొటో.. ఇలా అన్ని దృశ్యాలూ చూడముచ్చటగా ఉన్నాయి. ఈ రోజు బెంగ‌ళూరులో పెళ్లి రిసెప్షన్‌ జరుగుతుంది.త‌రువాత ఈ నెల చివ‌రిన ముంబైలో మరో రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు.ముంబైలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ బాలీవుడ్ ఇండ‌స్ట్రీ మొత్తం త‌ర‌లి రానుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -