Tuesday, May 21, 2024
- Advertisement -

శవాలని కూడా వదలని ఆ ముగ్గురు

- Advertisement -

ప్రయోగాల బాటలో నడుస్తోన్న టాలీవుడ్ లో… ఒక్కోసారి కొన్ని అరాచక చిత్రాలు మనకు తగులుతూ ఉంటాయి. ఏదో ప్రయోగం చేశామని వారు చెప్పుకుంటారుగాని అసలది ఏవిధంగా ప్రయోగమే వారికే సరిగా తెలియదు. రియల్ లైఫ్ లో జరిగిన సంఘటనలను ఆధారం చేసుకుని వారు ఈ సినిమాను చేసి ఉండొచ్చు. కాని అది ఎటువైపు దారి తీస్తుందో… ఎలాంటి మెసేజ్ లను జనాలకు ఇస్తుందో కనీసం ఇలాంటి సినిమా తీసేముందైనా… కనీసం ఓ సారి ఆలోచించుకోవల్సింది. కాని ఏం చేస్తాం ఎలాంటి ఆలోచన లేకుండానే దేవి శ్రీ ప్రసాద్ అనే చిత్రాన్ని తీసేసి మనముందుకు తీసుకొచ్చి పెట్టారు. ఇపుడీ సినిమాను మనం చూడాలంటారా..?

మనోజ్ నందన్, పూజా రామ‌చంద్రన్‌, భూపాల్ , ధ‌న‌రాజ్‌, పోసాని కృష్ణముర‌ళి, వేణు టిల్లు త‌దిత‌రులు ప్రధాన పాత్రలుగా ఉన్న ఈ చిత్రం నవంబర్ 10న విడుదల అవుతుంది. ప్రీ రిలీజ్ వేడుకలో ఈసినిమా ఎలాంటిదో… ఎంత రచ్చ చేసే సినిమానో తమ్మారెడ్డి భరద్వాజా స్పష్టంగా చెప్పేశారు. శవంతో సెక్స్ చేసే కాన్సెప్ట్ తో రూపొందిన మూవీగా ఈ సినిమా ఇప్పటికే అల్లరైంది.

ట్రైలర్ లో చూపించిన దాని ప్రకారం… యాక్టర్ భూపాల్ చెప్పిన డైలాగ్ తో… ఫిలిం చాలా కాంట్రవర్సీగా మారింది. రేపో మాపో సినిమాపై సోషల్ మీడియాలో అనవసర రాద్దాంతం జరిగినా జరిగొచ్చు అన్నట్లుగా కనిపిస్తుంది. సినిమాకు కథను సెలెక్ట్ చేసుకోవడానికి ఎన్నో స్టోరీలు ఉండగా పోయిపోయి… ఇలా శవంతో సెక్స్ చేసే స్టోరీని తీసుకోవడమేంటి అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. మార్కెట్లో ఉన్న గొడవల్లో దేవి శ్రీ ప్రసాద్ రచ్చ కనిపించడం లేదు గాని రేపో మాపో ఇష్యూ తెరపైకి రావచ్చు.

ఇపుడున్న రోజుల్లో ఒంటరిగా దొరికే అమ్మాయిలను వదిలిపెట్టకుండా హింసించే ఈ రోజుల్లో …ఇప్పుడు మృగాళ్లు ఏకంగా శవాలపై కూడా పడ్డారు అనే విషయాన్ని చెప్పడానికి ఈసినిమాను ఎంచుకున్నట్లుగా కనిపిస్తుంది. శవాలను కాల్చుకు తినే అఘోరాల కథలను మాత్రమే ఇప్పటి వరకు చూసిన మనకు… ఇప్పుడిలా మహిళా శవాలతో బిజినెస్ చేసుకునే వారిని కూడా చూస్తున్నాం. ట్రైలర్ చూస్తుంటే ఎవరికైనా సరే ఆడశవంతో కామ కలాపాలు చేసే మగాళ్లు కూడా ఉంటారా…అనే అనుమానం కలుగక మానదు.అయితే రీసెంట్ గా భయటపడిన కొన్ని యధార్థ సంఘటనలను ఆధారం చేసుకుని ఈ సినిమాను రూపొందిచినట్లు స్పష్టంగా అర్ధమవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -