Saturday, May 4, 2024
- Advertisement -

ఈ ఏడాది మ‌రో నాలుగైదు సినిమాల‌తో

- Advertisement -

నైజాం రాజుగా దిల్ రాజు కీర్తి గ‌డిస్తున్నాడు. 2017 సంవ‌త్స‌రంలో ఆరు విజ‌యాలు పొంది అగ్ర నిర్మాత‌గా మారాడు. మంచి సినిమాలు నిర్మిస్తూ ప్రేక్షకులు మ‌న‌సు దోచుకుంటున్న ఈ నిర్మాత త‌న శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సినిమాలు వ‌రుస‌గా తీస్తున్నారు. ఎస్‌వీసీ బ్యాన‌ర్ విజ‌యాల‌కు వేదిక‌గా నిలుస్తోంది. దిల్‌రాజు బ్యాన‌ర్‌లో ప‌నిచేసిన న‌టీన‌టులంద‌రికీ క‌లిసొస్తుంది. గ‌తేడాది మాదిరి ఈ ఏడాది కూడా నాలుగైదు సినిమాల‌తో వ‌స్తున్నాడు.

ఈ ఏడాది ప్ర‌స్తుతం నాలుగు ప్రాజెక్టులతో సిద్ధంగా ఉన్నాడు. మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమాను ఇప్ప‌టికే ప్రారంభించారు. శ్రీనివాస క‌ల్యాణం అని నితిన్‌ హీరోగా, రామ్ పోతినేని హీరోగా ఒక సినిమా, మరో సినిమా కూడా తీస్తున్నారు. గతేడాదిలాగే ఈ ఏడాది కూడా మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. త‌న సినిమాలు విజ‌య‌వంతం కావాల‌ని సింహాచ‌లం అప్ప‌న‌స్వామిని కోరుకున్నాడు. విశాఖ‌ప‌ట్ట‌ణం స‌మీపంలోని సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని సోమవారం ఆయన దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న అనంత‌రం అంతరాలయంలో అష్టోత్తరం పూజ చేశారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -