తనకంటూ ఒక ప్రత్యేక పంథాలో వెళతారు డైరెక్టర్ సుకుమార్. ఆయన ప్రొడక్షన్ లో వస్తున్న సినిమా కుమారి 21 ఎఫ్ మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైవిధ్య భరిత కథతో సుకుమార్ తానే స్వయంగా రాసిన కథతో ఈ సినిమా కి స్క్రీన్ ప్లే కూడా ఇచ్చారు.
ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ మీద , పాటల మీద యువత చాలా ఇష్టం పెంచుకున్నాడు. దేవీ ఇచ్చిన మ్యూజిక్ ఈ సినిమా కి చాలా ప్లస్ గా చెబుతున్నారు.
దిల్ రాజు ఈ సినిమా మీద ఆసక్తి తో నైజాం హక్కులు కొన్నారు, నిజాం తో పాటు ఉత్తరాంధ్ర లో కొన్ని చోట్ల కూడా తన వారి ద్వారా పంపిణీ చేసేపనిలో ఉన్నారు దిల్ రాజు దాంతో ఆయన సినిమా వర్గాల వారితో పాటు ప్రేక్షకుల లో కూడా కొత్త ఆశలు రేకెత్తించారు.
ఇప్పటికే దేవీ పాటలు, సుకుమార్ స్క్రీన్ ప్లే, వేలు సినిమాటోగ్రఫీ తో సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉండగా దిల్ రాజు సినిమా పంపిణీ చెయ్యడానికి ఆసక్తి చూపించడం తో ఆయన సినిమా టేక్ ఓవర్ చేసారు అంటే సూపర్ విషయం ఉంటుంది అని నమ్మకం జనాల్లో ఉంది.