Saturday, May 18, 2024
- Advertisement -

ప్రభాస్ సినిమా కోసం దిల్ రాజు అన్ని కోట్లు పెట్టాడట

- Advertisement -

2018 ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు కి భారంగానే గడిచిందని చెప్పుకోవచ్చు. దిల్ రాజు నిర్మించిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. కానీ 2019 లో దిల్ రాజు ‘ఎఫ్ 2’ అనే సినిమాతో ఎట్టకేలకు హిట్ అందుకున్నారు. ఇక తాజాగా ఒక పెద్ద బడ్జెట్ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు దిల్ రాజు. ఆ సినిమా ఏదో కాదు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సాహో’. ‘బాహుబలి’ సినిమా తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.

యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ఈ సినిమా నిర్మాతలు వంశీకృష్ణారెడ్డి మరియు ప్రమోద్ ఉప్పలపాటి మంచి స్నేహితులు కావడంతో ‘సాహో’ సినిమా నిజాం మరియు వైజాగ్ మరియు థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం ఏకంగా 45 కోట్లు దిల్ రాజు ఇచ్చినట్టు సమాచారం. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదల కాబోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -