ఈ మద్య చిన్న చిత్రాల జోరు పెరిగిపోయింది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న చిత్రాలను ఆడియన్స్ కూడా బాగా ఆదరిస్తున్నారు. తాజాగా అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, చాందిని తమిళ్రాసన్, శాని సాల్మాన్, శెర్రి అగర్వాల్ ప్రధాన పాత్రలల్లో నటిస్తున్నారు. ఎఎస్పి మీడియా హౌస్, జివి ఐడియాస్ పతాకాలపై ప్రొడక్షన్ నెం.1గా అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ నిర్మాతలుగా తెరకెక్కుతున్న సినిమా ‘పీనట్ డైమండ్’. వెంకటేష్ త్రిపర్ణ కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అందిస్తున్నారు. ఈ సినిమాకి ‘బెంగాల్ టైగర్’ ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు.
చెడు, మంచి అనేది త్రేతాయుగం, ద్వాపరయుగంలో ఎలా ఉండేదో వివరిస్తూ ప్రారంభమైన ఈ ట్రైలర్లో కలియుగంలో మంచికి చోటు లేదు.. చెడుకి మాత్రమే చోటుంది అనేలా ట్రైలర్ ఆసక్తిని కలిగిస్తోంది. ఈ మూవీ ఓ డైమెండ్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో సుమన్, శుభలేఖ సుధాకర్ పాత్రలు కనిపిస్తున్నాయి. ట్రైలర్ విడుదల చేసిన క్రిష్ మాట్లాడుతూ ‘పీనట్ డైమండ్’ టైటిల్ ఎంతో ఆసక్తిగా ఉంది. ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి జె. ప్రభాకర రెడ్డి ఛాయాగ్రహకుడిగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ప్రముఖ దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ.. పీనట్ డైమండ్ టైటిల్ ఎంతో ఆసక్తిగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది.. దర్శకుడు ఎంత శ్రద్ధ పెట్టి సినిమా చేశారో అర్థం అవుతుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ మూవీ మంచి హిట్ అందుకుంటుందన్న గట్టి నమ్మకం తనకు ఉందని అన్నారు.