Wednesday, April 24, 2024
- Advertisement -

క్రిష్​కు షాకిచ్చిన పవర్​ స్టార్​.. విషయం ఏమిటంటే?

- Advertisement -

ప్రముఖ దర్శకుడు క్రిష్​తో పవన్​ కల్యాణ్ హరిహర వీరమల్లు అనే ఓ చారిత్రక చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వకీల్​ సాబ్​తో సక్సెస్​ అందుకున్న పవన్​ కూడా మరో మాస్​ హిట్​ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇదిలా ఉంటే హరిహర వీరమల్లు వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ముందు ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఆ మూవీకి బదులుగా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్​ పండగ బరిలో దిగుతున్నట్టు సమాచారం.

మలయాళంలో సూపర్​ హిట్​ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ ను తెలుగులోకి రీమేక్​ చేస్తున్న విషయం తెలిసిందే. సాగర్ కే చంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. నిజానికి ఈ సంక్రాంతికి హరిహర వీరమల్లు చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇప్పుడు మలయాళ రీమేక్​ చిత్రాన్ని ముందు తీసుకొస్తున్నారట. హరి హర వీరమల్లును పాన్ ఇండియా కేటగిరిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం కొన్ని సెట్స్ వేయాల్సి ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ కి చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో సంక్రాంతికి సిద్ధం చేయడం కష్టమని భావించడంతో పవన్ ఈ నిర్ణయానికి వచ్చారని సమాచారం.

Also Read: సూర్య గొప్ప మనసు.. ఫ్యాన్స్​కు ఆర్థిక సాయం..!

ఈ చిత్రంలో పవన్​ కల్యాణ్​తో పాటు రానా కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. పవన్ సరసన సాయి పల్లవి, రానా కు జోడీగా ఐశ్వర్య రాజేష్ ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని టాక్​. పవన్ లాంటి స్టార్ ఉన్నారు కాబట్టి ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ని పెడుతున్నామని ఇటీవల ప్రొడ్యూసర్ నాగవంశీ వెల్లడించారు. అయితే నిజానికి ఒరిజనల్​లో ప్లాష్​బ్యాక్​ లేదు. కానీ రీమేక్​ వచ్చేసరికి పవన్​ ఇమేజ్​ను దృష్టిలో ఉంచుకొని ప్లాష్​బ్యాక్​ చిత్రీకరిస్తున్నట్టు టాక్​.

Also Read: కమల్​ను ఇండియన్​ -2 శనిలా వెంటాడుతోంది? మధ్యేమార్గంగా ప్లాన్​చేసిన కమల్​..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -