ప్రముఖ దర్శకుడు క్రిష్తో పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు అనే ఓ చారిత్రక చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్తో సక్సెస్ అందుకున్న పవన్ కూడా మరో మాస్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇదిలా ఉంటే హరిహర వీరమల్లు వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ముందు ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఆ మూవీకి బదులుగా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ పండగ బరిలో దిగుతున్నట్టు సమాచారం.
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ ను తెలుగులోకి రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. సాగర్ కే చంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. నిజానికి ఈ సంక్రాంతికి హరిహర వీరమల్లు చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇప్పుడు మలయాళ రీమేక్ చిత్రాన్ని ముందు తీసుకొస్తున్నారట. హరి హర వీరమల్లును పాన్ ఇండియా కేటగిరిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం కొన్ని సెట్స్ వేయాల్సి ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ కి చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో సంక్రాంతికి సిద్ధం చేయడం కష్టమని భావించడంతో పవన్ ఈ నిర్ణయానికి వచ్చారని సమాచారం.
Also Read: సూర్య గొప్ప మనసు.. ఫ్యాన్స్కు ఆర్థిక సాయం..!
ఈ చిత్రంలో పవన్ కల్యాణ్తో పాటు రానా కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. పవన్ సరసన సాయి పల్లవి, రానా కు జోడీగా ఐశ్వర్య రాజేష్ ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని టాక్. పవన్ లాంటి స్టార్ ఉన్నారు కాబట్టి ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ని పెడుతున్నామని ఇటీవల ప్రొడ్యూసర్ నాగవంశీ వెల్లడించారు. అయితే నిజానికి ఒరిజనల్లో ప్లాష్బ్యాక్ లేదు. కానీ రీమేక్ వచ్చేసరికి పవన్ ఇమేజ్ను దృష్టిలో ఉంచుకొని ప్లాష్బ్యాక్ చిత్రీకరిస్తున్నట్టు టాక్.
Also Read: కమల్ను ఇండియన్ -2 శనిలా వెంటాడుతోంది? మధ్యేమార్గంగా ప్లాన్చేసిన కమల్..!