వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితచరిత్ర ఆధారంగా బాలీవుడ్లో ‘మణికర్ణిక’ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు మన తెలుగు దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో లక్ష్మీభాయి పాత్రలో కంగనా రనౌత్ నటిస్తోంది. ఇటీవల ఆ సినిమా ఫొటోలు బయటకు రావడంతో సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. చారిత్రక నేపథ్యంతో కూడిన సినిమాను రూపొందించడం.. అది వీరనారి లక్ష్మీభాయి జీవిత చరిత్రపై సినిమా కావడంతో దేశవ్యాప్తంగా సినిమా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
అయితే ఈ సినిమా ఇటీవల పూర్తి చేసుకుంది. చారిత్రక సినిమాలు తీయడంలో క్రిష్ పట్టు సాధించినట్లు కనిపిస్తున్నాడు. గతంలో బాలకృష్ణతో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చేసి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాకు చేసిన ఖర్చే షాకింగవుతోంది. రూ.60 నుంచి 70 కోట్ల వరకూ ఖర్చు అనుకోగా ఇప్పుడు రూ.200 కోట్లు ఈ సినిమాకు ఖర్చు చేస్తున్నారంట.
కానీ ఈ సినిమా బడ్జెట్ రూ.200 కోట్లు అని కంగనా రనౌత్ ఒక టీవీ షోలో తెలిపింది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకు రూ.100 కోట్ల బడ్జెట్లో తీయడానికి దర్శక, నిర్మాతలు ఆలోచన చేస్తారు. కానీ ‘మణికర్ణిక’కు ఇంత స్థాయిలో ఖర్చు చేస్తున్నట్టు కంగనా ప్రకటించడం షాక్కు గురి చేస్తోంది.