తన భర్త ఒకప్పుడు సూపర్హిట్ సినిమాలు చేసిన దర్శకుడు. అయితే ప్రస్తుతం తన భర్త తీసిన సినిమాలు అట్టర్ ఫ్లాపులు కావడంతో ఆందోళనలో పడ్డాడు. ఆ తర్వాత తను తీసిన చివరి సినిమా కూడా ఫ్లాపవడంతో దర్శకుడు, అతడి భార్య బాధకు గురవుతున్నారు. సినిమాలను నమ్ముకుంటే భవిష్యత్ కష్టం అని తెలుసుకొని దర్శకుడి భార్య వ్యాపారం చేయడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రెస్టారెంట్ వ్యాపారంలోకి దర్శకుడు శ్రీనువైట్ల భార్య రూప రంగంలోకి దిగింది.
సినీ రంగంలో ఉన్న వారు వ్యాపారాలు చేయడం సాధారణమే. వారందరూ పబ్లు, రెస్టారెంట్ వ్యాపారాలపై ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. దానిలో భాగంగానే ఎంతోమంది హీరోలు, నటీనటులు, హీరోయిన్లు పబ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు ప్రారంభించి వ్యాపారంలో రాణిస్తున్నారు. వీరి జాబితాలో శ్రీనువైట్ల భార్య రూప కూడా ఈ వ్యాపారంలోకి దిగింది. వేదిక్ పేరుతో వ్యవసాయాధారిత సేంద్రీయ ఉత్పత్తుల బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈ బ్రాండ్ను హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రారంభించి ప్రచారం చేసింది.
శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేశ్బాబు నటించిన సినిమా ఆగడు. ఈ సినిమాకు రూప కాస్ట్యూమ్ డిజైనర్గా పని చేశారు. ఇప్పుడు భర్త సినిమాలు చేయకున్నా తాను వ్యాపారం చేయాలని రూప భావిస్తోంది.