చంద్రబాబు మళ్లీ ఓ తెనె తుట్టను కదిపారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ గురించి ప్రస్తావన రావటం.. దాన్ని చూడొద్దన్న రీతిలో బాబు వ్యాఖ్యానించినట్లుగా ఆయన అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలా ఈ వార్త బయటికి వచ్చిందో లేదో.. ఇలా లక్ష్మీపార్వతి రియాక్టయ్యారు.
ఏ సినిమా చూడాలో కూడా బాబే చెబుతారా.. ఇది ఆయన దిగజారినతనానికి ఉదహారణ అంటూ ఫైర్ అయ్యారు లక్ష్మీ పార్వతి. సినిమా చూస్తే నిజాలు ప్రజలకు తెలుస్తాయని చంద్రబాబు భయపడుతున్నారన్నారు. ఈ సినిమా ద్వారా ఇన్నాళ్లకు చంద్రబాబు పాపం పండిందన్నారు. వాటీజ్ దిస్ అనేది…ఈ సినిమాతోనే తెలుస్తుందని ఆమె అన్నారు.
ఈ సినిమా తీసినందుకు వర్మకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదన్నారు. ఇన్నాళ్లూ వ్యవస్థలను మేనేజ్ చేసిన చంద్రబాబు రాజకీయ జీవితం ఇక ముగిసిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబు చేసిన పాపాలన్నీ నలు వైపుల నుంచి కారుమేఘాల్లా కమ్ముకొస్తున్నాయన్నారు. తననపై ఆకారణంగా నిందలు వేసి.. అవాస్తవాలు ప్రచారం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసిన లక్ష్మీ పార్వతి.. చరిత్రను దిక్కు మొక్కు లేకుండా చేయాలని చూసిన బాబు దుర్మార్గం ఇన్నాళ్లకు లక్ష్మీస్ఎన్టీఆర్ రూపంలో బయటకు రానుందన్నారు.