శ్రీనివాస్ రెడ్డి కమెడియన్గానే చేస్తు హీరోగా తన అదృష్టాన్ని పరిక్షించకుంటున్నాడు.నటుడిగా తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్నాడు.తన పేరు మీద నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ సృష్టించి సినిమా అవకాశాలు ఇప్పిస్తానని ఓ వ్యక్తి మోసం చేస్తున్నాడని శ్రీనివాస్ రెడ్డి మంగళవారం సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. టాలీవుడ్ లో కోడైరెక్టర్ గా చేస్తున్న రవికిరణ్ అనే వ్యక్తి.. తన పేరిట ఈ నకిలీ ఫేస్ బుక్ ఖాతా తెరిచి మోసం చేస్తున్నాడని ఫిర్యాదులో పెర్కొన్నాడు.
ఇండస్ట్రీలోని పరిచయాలను అడ్డం పెట్టుకొని సినిమా అవకాశాలు ఇప్పిస్తానని.. మంచి కథలు ఉంటే పంపాలని పలువురితో చాట్ చేస్తున్నాడని వివరించాడు.ఇటీవల రవికిరణ్ కేరళ వరద బాధితుల కోసం విరాళాలు సేకరిస్తున్నానంటూ కొంత మంది దగ్గర రూ.5వేల వరకూ డబ్బును తన అకౌంట్ జమ చేయించుకున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు.కేసు నమోదు చేసిన పోలీసులు రవి కిరణ్ అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.