Sunday, May 5, 2024
- Advertisement -

మీ కోసం ఎవ‌రు రాలేదు ..సల్మాన్ కోసం వ‌చ్చాము

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ క‌త్రినా కైఫ్‌కు అమెరికాలో ఓ చేదు సంఘ‌ట‌న ఎదురైంది.క‌త్రినా ప్ర‌స్తుతం దబాంగ్‌ టూర్‌లో భాగంగా ప్రస్తుతం వాంకోవర్‌లో ఉంది.కత్రినా త‌న డ్యాన్స్‌తో అభిమానుల‌ను అల‌రించింది.ఆమెను చూడ‌టానికి వేలాది మంది వ‌చ్చారు.వేదిక వద్దకు చేరుకునే క్రమంలో సెల్పీల కోసం అభిమానులు చుట్టుమున్నారు. తమతో సెల్పీలు దిగాల్సిందిగా కోరడంతో కొందరికి అవకాశం ఇచ్చారు. కాసేపటి తర్వాత… ‘మీరిలా చేయకండి. నేను అలసిపోయాను అని తెలుసు కదా. నేను ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయంటూ’ కత్రినా కాస్త గట్టిగానే అభిమానులను మందలించారు.

కత్రినా వ్యాఖ్యలకు బాధపడిన ఓ మహిళ.. ‘ మీ ప్రవర్తను మార్చుకోండి. పెద్ద హీరోయిన్‌ అని చెప్పుకుంటారు కదా.. అభిమానులు ముచ్చటపడి దగ్గరికి వస్తే ఇలా కసురుకుంటారా’ అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. దీంతో కత్రినా కూడా ఆమెతో గొడవకు సిద్ధమైపోయారు. కత్రినా సెక్యూరిటీ సిబ్బంది కలుగజేసుకుని ఆమెను వారించారు. అయినప్పటికీ ఆ మహిళ ఊరుకోకుండా.. ‘మీ కోసం ఎవరూ రాలేదు. మేమంతా సల్మాన్‌ ఖాన్‌ కోసం వచ్చాం.. కేవలం ఆయన కోసమే’ అంటూ కత్రినాను హేళన చేశారు. దీంతో క్ర‌తినా అక్క‌డి నుండి సైలెంట్‌గా వెనుతిరిగారు.క‌త్రినాకు మాములుగా కోపం రాదు.ఆమె అప్ప‌టికే డ్యాన్స్ చేసి అల‌సిపోయి ఉండ‌టందో ఆమె ఇలా కోప‌నికి లోనైయ్యార‌ని క‌త్రినా పీఏ ఈ ఘ‌ట‌న‌పై వివ‌ర‌ణ ఇచ్చారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -