Thursday, May 9, 2024
- Advertisement -

ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ వచ్చిన సెలబ్రిటీలు వీళ్లే!

- Advertisement -

మన దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. ఈ క్రమంలోనే సాధారణ ప్రజల నుంచి ప్రముఖ వ్యక్తుల వరకు కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు ఎక్కువగా కరోనా మహమ్మారికి గురవుతున్నారు. తాజాగా నటి పూజా హెగ్డే కరోనా బారిన పడినట్లుగా స్వయంగా ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

ప్రస్తుతం పూజా హెగ్డే ఐసోలేషన్ లో ఉంటూ కరోనా ప్రోటోకాల్ ను పాటిస్తున్నట్లు ఆమె తెలిపారు. అయితే ఈ బుట్టబొమ్మ కన్నా ముందుగా ఎంతో మంది సెలబ్రిటీలు కరోనా బారినపడి కోలుకున్నారు. అయితే పూజా హెగ్డే కన్నా ముందుగా కరోనా బారిన పడిన ఆ సెలబ్రిటీలు ఎవరు ఇక్కడ తెలుసుకుందాం..

తాజాగా చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కరోనా బారిన పడినట్లుగా ఆయన వెల్లడించారు. అదేవిధంగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడికి కూడా కరోనా సోకినట్లు సమాచారం.దీంతో ప్రస్తుతం తాను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కూడా వాయిదా వేశారు. సరైన సమయంలో ఎంతో మందికి సహాయం చేసిన నటుడు సోను సూద్ మొదటి డోస్ వాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడ్డారు.

పవన్ కళ్యాణ్, దిల్ రాజు, అల్లుఅరవింద్, నగ్మా, కత్రినా కైఫ్, అమితాబచ్చన్, అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్, నివేద థామస్, అంజలి, అలియా భట్, త్రివిక్రమ్ శ్రీనివాస్, అమీర్ ఖాన్, జెనీలియా, వరుణ్ తేజ్, చరణ్, నాగబాబు దంపతులు, రకుల్, కృతి సనన్ మొదలైన సెలబ్రిటీల అందరూ కరోనా బారినపడి కోలుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -