Wednesday, May 15, 2024
- Advertisement -

బాహుబ‌లి Vs 2.0 తొలి రోజు క‌లెక్ష‌న్స్‌

- Advertisement -

ఇప్పుడు ఇండియా మొత్తం ర‌జనీ మ్యానియాతో మునిగి తెలుతుంది. 2.0 సినిమా విడుద‌ల అవడంతో ర‌జినీకాంత్ అభిమానులు తెగ హ‌డావిడి చేస్తున్నారు. 2.0కు హిట్ టాక్ రావ‌డంతో అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. సినిమాను కూడా భారీ ఎత్తున విడుద‌ల చేయ‌డంతో,సినిమా తొలి రోజు క‌లెక్ష‌న్స్‌లో దుమ్ము దులిపింది అంటున్నారు సినీ వ‌ర్గాలు. 2.0 మొద‌టి నుంచి బాహుబ‌లిని టార్గెట్ చేసుకుని వ‌చ్చిందే. చాలామంది ఈ సినిమాను బాహుబ‌లితో కంపెర్ చేసి రివ్యూలు కూడా ఇచ్చారు. ఇక క‌లెక్ష‌న్లు విష‌యంలో కూడా ఈ రెండు సినిమాలు పోటీ ప‌డ్డాయి.

ప్ర‌భాస్ న‌టించిన బాహుబ‌లి సినిమా మొద‌టి రోజు 100 కోట్లుపైగా క‌లెక్ట్ చేసింది. ర‌జినీ 2.0 మొద‌టి రోజున బాహుబ‌లి రికార్డుల‌ను బ్రేక్ చేసింద‌ని సినీ విశ్లేకులు చెబుతున్నారు. ర‌జినీకి ప్ర‌పంచం మొత్తం అభిమానులు ఉండంటంతో ,ఓవ‌ర్ఆల్‌గా ఈ సినిమా మొద‌టి రోజున 180 కోట్లు క‌లెక్ట్ చేసింద‌ని స‌మాచారం. ఈ లెక్క‌న 2.0 బాహుబ‌లి రికార్డుల‌ను అన్నింటిని ఈ సినిమా బ్రేక్ చేయ‌డం ఖాయం అంటున్నారు ర‌జినీ అభిమానులు. దీనిపై ప్ర‌భాస్ అభిమానులు కూడా గ‌ట్టిగానే వాదిస్తున్నారు. ర‌జినీ స‌ర్ అంటే మా హీరోతో పాటు మాకు కూడా చాలా అభిమానం. అయిన‌ప్ప‌టికి 2.0 బాహుబ‌లి రికార్డుల‌ను బ్రేక్ చేయ‌లేద‌ని అంటున్నారు ప్ర‌భాస్ ఫ్యాన్స్‌. మ‌రి వీరిలో చివ‌రికి ఎవ‌రు విజ‌యం సాధిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -