సింగర్ గీతా మాధురి ,నటుడు నందు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిదే.పెళ్లి తరువాత ఎవరి రంగాలలో వారు బిజీగా ఉన్నారు.గీతా మాధురి ప్రస్తుతం తెలుగు బిగ్బాస్లో సెలబ్రిటీగా ఉంది.కాని ఆమె భర్త నందు బయట సినిమాలు చేయకుండా తప్పించుకుని తిరుగుతున్నడని వార్తలు వినిపిస్తున్నాయి..పూర్తి వివరాల్లోకి వెళ్తే…నందు నటించిన ఐందవి హర్రర్ మూవీ ఆడియో ఫంక్షన్ జరిగింది. రెసన్నీ విన్నీ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ ఆడియో లాంఛ్ కార్యక్రమానికి చిత్ర బృందం హాజరైన హీరో నందు రాకపోవటం ఆసక్తికరంగా మారింది.ఇదే సమయంలో చిత్ర నిర్మాత నోరు విప్పి.. హీరో నందుకు తనకు చుక్కలు చూపిస్తున్నాడంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. నందు ఇలాంటి అటిట్యూడ్తో వరస వివాదాలను కొనితెచ్చుకుంటున్నాడు.
నందు ప్రవర్తనపై నిర్మాత మాట్లాడుతు….మా సినిమాలో నటించిన హీరో నందు ఆడియో ఫంక్షన్కు రాకపోవడం చాలా దారుణం. కొత్త నిర్మాత దర్శకుడికి అండగా ఉండాల్సిన ఆయన తీరు అభ్యంతరకరంగా ఉంది. నందు పెద్ద హీరో కాడు. హీరో స్థాయి ఏదైనా కానీ నిర్మాత ఎవరైనా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది.నందును నమ్మి ఎంతో కష్టపడి నిర్మాతలు సినిమాను తీస్తున్నారు. పలుమార్లు వేడుకకు రావాలని అడిగితే తప్పించుకొని తిరుగుతున్నాడని తెలిసిందని… ఊర్లో లేను బిజీగా ఉన్నాను అని అంటూ ముఖం చాటేశాడట నందు. ఈ విషయాలను నిర్మాత ఆడియో ఫంక్షన్లోనే చెప్పడంతో నందులో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అని అందరు చర్చించుకుంటున్నారు.