బిగ్బాస్ రెండో సీజన్ ముగిసి చాలాకాలమైన ఇంకా దాని చూట్టునే తిరుగుతున్నారు బిగ్బాస్ హౌస్మెట్స్.బిగ్బాస్ రెండో సీజన్ ఎక్కువ కాంట్రవర్షియల్ అయిన సంగతి తెలిసిందే.ఒక్క కౌశల్ ఆర్మీ తోనే సెకండ్ సీజన్ కి మరింత హైప్ వచ్చిందని చెప్పవచ్చు. అయితే ఇదే సమయంలో హౌస్మెట్స్పై కొన్ని రూమర్స్ వచ్చాయి. షో మొదట్లో సామ్రాట్,తేజస్వి రిలేషన్లో ఉన్నట్లు కనిపించారు.అలాగే తనీష్-దీప్తి సునైనాల మధ్య చిన్న లవ్ ట్రాక్ నడించింది.ఇక షో చివరికి వచ్చే సరికి గీతా మాధురి- సామ్రాట్లు కూడా రిలేషన్లో ఉన్నట్లే కనిపించారు.నాని రాఖీ సామ్రాట్కు రాఖీ కట్టమని చెప్పినప్పుడు గీతా మాధురిలో ఫేస్లో హవభావాలు చూడాలి.
దీని బట్టే చాలామంది వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని వార్తలు వచ్చాయి.అయితే ఆ విషయంపై గీత మాధురి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. మనిషితో కళ్లల్లోకి చూడకుండా ముక్కు జుట్టు చూసి మాట్లాడతారా? గేమ్ లో నవ్వడం , మాట్లాడటం సాధారణం. అమిత్ బయ్యతో కూడా అలానే ఉన్నాను. సామ్రాట్ విషయంలో మాత్రమే అలా అయ్యింది. దాన్ని తప్పుగా అనుకుంటే ఎలా?. అలా అయితే నెక్స్ట్ బిగ్బాస్ సీజన్కి వెళ్లేవారిని ఎవరితో మాట్లాడకుండా ఉండాలని ముందే చెప్పాలి.ఆ బాండింగ్ ఏంటో మాకు తెలుసు. వివిధ రకాలుగా చుస్తే ఏం చెయ్యలేం.