- Advertisement -
పంతం సినిమాతో చాలా కాలం తరువాత హిట్ కొట్టాడు హీరో గోపిచంద్.ఈ సినిమా విజయంతో తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు గోపిచంద్.ప్రముఖ నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణంలో గోపిచంద్ ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాకు కమార్ సాయి అనే కొత్త కుర్రాడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమాలో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ను తీసుకున్నారని సమాచారం.ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్స్తో పెద్దగా పనిచేయలేదు గోపిచంద్.వీరి కాంబినేషన్ ఫ్రెష్గా ఉంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు పెట్టి…సంక్రాంతికి సినిమాను విడుదల చేయనున్నారు.