- Advertisement -
బాలీవుడ్కు చెందిన హీరోయిన్ డెబ్లీనా బెనర్జీ తన భర్తతో కలిసి మోసానికి పాల్పడినట్లుగా ఆరోపణలు రావడంతో ఆమెపై కేసు నమోదైంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే..తెలుగులో అమ్మాయిలు అబ్బాయిలు సినిమాలో హీరోయిన్గా నటించిన డెబ్లీనా బెనర్జీ తరువాత కాలంలో బాలీవుడ్లో కొన్ని సినిమాలు చేసి తనకంటు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.
అయితే టీవి నటుడు గుర్మీత్ చౌదరిను ప్రేమించి పెళ్లి చేసుకుంది.సినిమాలలో అవకాశాలు తగ్గడంతో ఎక్కడ కనిపించడం లేదు.అయితే భర్తతో కలిసి బాలీవుడ్ లో ఛాన్సులు ఇప్పిస్తామంటూ కొంతమందిని మోసం చేస్తున్నారన్న ఆరోపణలతో మళ్లీ వార్తల్లో నిలిచింది డెబ్లీనా బెనర్జీ. మరి వారిపై నమోదైన కేసుపై ఈ హీరోయిన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.