- Advertisement -
ఆదిత్ అరుణ్ .. హెబ్బా పటేల్ జంటగా నటించిన ’24 కిస్సెస్’ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది.ఇప్పటికే విడుదల అయిన టీజర్,ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది.అయోధ్య కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 23న విడుదల చేయనున్నారు. టైటిల్ను బట్టే ఇది యూత్ కి సంబంధించిన కథ అనీ, ప్రేమకథా చిత్రమనే విషయం అర్థమైపోతోంది.
ఈ మధ్య కాలంలో హెబ్బా పటేల్ కి అంతగా అవకాశాలు లేవు. అందువలన ఈ సినిమాతో హిట్ పడితే బాగుంటుందనే ఆశతో ఆమె వుంది.ట్రైలర్లోనే ముద్దులతో రెచ్చిపోయిన హెబ్బా ఇక సినిమాలో ఎంతలా రెచ్చిపోయిందో అని అభిమానులు ఆశిస్తున్నారు.