Sunday, May 19, 2024
- Advertisement -

సంచలనంగా మారిన‌ హీరో విశాల్ ట్వీట్

- Advertisement -

విశాల్ త‌మిళ్‌నాడులో మాస్ ఫాలొయింగ్ ఉన్న హీరో.విశాల్‌కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది.అత‌ని సినిమాలు తెలుగులో మంచి క‌లెక్ష‌న్స్ సాధిస్తాయి. నడిగర్ సంఘం ఎలెక్ష‌న్‌లో విజ‌యం సాధించిన ద‌గ్గ‌ర నుండి బాగా అగ్ర‌సివ్‌గా ఉంటున్న విశాల్‌, జ‌య‌ల‌లిత మ‌ర‌ణంతో ఏర్ప‌డిన బైఎలెక్ష‌న్స్లో పోటి చేయ‌టానికి ప్ర‌య‌త్నాంచాడు.రైతులు కోసం అనేక పోరాటాలు కూడా చేశాడు విశాల్‌.అయితే తాజాగా విశాల్ చేసిన ట్వీట్ సంచ‌ల‌నంగా మారింది.

పాలకులను ఉద్దేశించి సినీ హీరో, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. నీట్ పరీక్షల నేపథ్యంలో అనిత దగ్గర నుంచి కృష్ణసామి వరకు జరిగిన మరణాలకు పాలకులే కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.పాలకులకు ప్రజలు గుణపాఠం చెప్పితీరుతారని అన్నారు.నీట్ పరీక్ష కోసం కస్తూరి అనే విద్యార్థిని కేరళకు తీసుకెళ్లిన అతని తండ్రి కృష్ణసామి గుండెపోటుకు గురై మరణించారు. కృష్ణసామి మరణంతో అనాథగా మిగిలిపోయిన మహాలింగం కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -