అలనాడు ప్రేక్షకుల ఆరాధ్య దేవత.. అందాలకు చిరునామాగా నిలిచిన అందాల తార ఇప్పుడు తన సెకండ జర్నీని ప్రారంభించి మెల్లగా అడుగులు వేస్తున్నారు. దృశ్యం సినిమాతో అందర్నీ ఆకట్టుకున్న మీనా రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించారు. ఆ సినిమాలో వెంకటేశ్తో జోడిగా నటించిన ఆమె ఇప్పుడు ఓ యువ నటుడికి తల్లి పాత్రలో మెరవనున్నారు.
జయనాయక నాయకి సినిమా పరాజయం పొందిన తన తండ్రి ప్రోత్సాహంతో ఇంకా సినీ పరిశ్రమలో బెల్లంకొండ శ్రీనివాస్ కొనసాగుతున్నాడు. శ్రీవాసు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘సాక్ష్యం’ అని పేరు ఖరారు చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ తల్లి పాత్రలో మీనా నటించనున్నారట. చూడగానే ఆకట్టుకునే అందంతో ఇప్పటికీ ఆమె వయసుకు తగ్గ పాత్రలతో ఆకట్టుకుంటోంది. ఇప్పుడు అమ్మ పాత్రలను కొనసాగిస్తోంది. దృశ్యం సినిమాలో వెంకటేశ్ భార్యగా, ఇద్దరు పిల్లల తల్లిగా నటించింది. ఇప్పుడు మళ్లీ అదే పాత్రలో కనిపించబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్గా ఈ సినిమాలో చేస్తోంది. మీనా కూడా తెలుగు సినీ పరిశ్రమపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటీవల ‘మామ మంచు అల్లుడు కంచు’లో కూడా మెరిశారు.