టాలీవుడ్లో క్యాస్ట్ కౌచింగ్ వ్యవహారం చివరకు రాజకీయ రంగు పులముకున్న సంగతి తెలిసిందే. మీడియాను కూడా ఈ వ్యవహారంలోకి లాగింది శ్రీరెడ్డి. పవన్, ఆయన తల్లిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలను కొన్ని టీవీ ఛానల్లు పదే పదే ప్రసారం చేయడంపై పవన్ తీవ్రంగా మండిపడ్డారు.
ఎల్లోమీడియాపై పవన్ తిరుగుబాటు ఎగరవేసిన సంగతి తెలిసిందే. టీవీ9, ఏబీఎన్, టీవీ 5ఛానల్లను టార్గెట్ చేస్తూ పలు సంచలన ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇంకో అడుగు ముందుకేసి ఎల్లోమీడియాను బహిస్కరించండంటూ అభిమానులకు పవన్ పిలుపు నిచ్చారు.
అయితే ఈ వ్యవహారాన్ని సీనీ ఇండస్ట్రీ సీరయస్గా తీసుకుంది. ఇండస్ట్రీలోని మహిళలను టీవీ5 యాంకర్ అసభ్య పదజాలంతో దూషించినా …ఇండస్ట్రీని కించపరిచేలా కార్యక్రమాలు ప్రసారం చేసినా ఇండస్ట్రీ తరఫు నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంపై పవన్ గుర్రుగా ఉన్నారు.
ఇండస్ట్రీపై మీడియా వైఖరి….దానిపై భవిష్యత్ కార్యచరణ గురించి చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పవన్ లేవనెత్తిన అంశాలు….రాజకీయంగా కూడా ముడిపడి ఉండడంతో చిరంజీవి చొరవ తీసుకుని ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
పవన్ – ఎన్టీఆర్ – మహేష్ లతో పాటు నాని – శర్వానంద్ తదితర హీరోలందరూ ఈ సమావేశానికి హాజరవుతారని వినికిడి. ఈ సమావేశానికి మీడియాకు ఆహ్వానం ఉండకపోవచ్చని…ఇది పూర్తిగా ఇండస్ట్రీ అంతర్గత సమావేశంగా జరగబోతోందని టాక్. మరి ఈసమావేశంలో పవన్ లేవనెత్తిన అంశాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారేది ఆసక్తికరంగా మారింది.