- Advertisement -
రంగస్థలం హిట్తో హీరో రాంచరణ్తో పాటు అందరికి మంచి పేరు తెచ్చిపెట్టింది.మరీముఖ్యంగా అనసూయకి మంచి పేరు వచ్చింది ఈ సినిమాలో రంగమ్మత్తగా అనసూయ పాత్రకు మంచి ఇమేజ్ వచ్చింది.దానికి ప్రతిఫలంగా రంగమ్మత్త అందరికి విందు భోజనం పెట్టింది. ఈ విషయాన్ని స్వయంగా అనసూయనే తన ఫేస్బుక్ ద్వారా తెలియజేసింది. ‘రంగస్థలం’ మర్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
చిట్టిబాబు, రామలక్ష్మిల నటనకు బ్రహ్మరథం పడుతున్నారు. ‘రంగస్థలం’ సినిమాలో తనతో పాటు కలిసి పనిచేసిన యూనిట్ సభ్యులకు రంగమ్మత్త విందు భోజనాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వ వహించారు.పూజ హెగ్డే ఈ సినిమా ఐటెం సాంగ్లో దర్శనం ఇచ్చింది.