Friday, May 10, 2024
- Advertisement -

రజనీకాంత్.. రాజమౌళి మధ్య విబేధాలు ముగిశాయా?!

- Advertisement -

సాధారణంగా రాజమౌళి ఏ హీరోతోనూ వివాదాలు పెట్టుకోడు. అందరితోనూ సఖ్యతగా ఉండటానికే ప్రయత్నిస్తాడు. తను సినిమాను రూపొందిస్తున్న హీరోను ఒక రేంజ్ లో పొగిడేస్తాడు ఈ దర్శకుడు.

ఏ హీరోతో సినిమా చేస్తుంటే అతడిని ఆకాశానికెత్తేయడం కూడా ఈ దర్శకుడి స్టైల్. అలాగే తను సినిమాలు చేయని వారితో కూడా సన్నిహిత సంబంధాలను కలిగి ఉంటాడీయన.

కానీ ఆ మధ్య సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ఒక ప్రకటన ఆసక్తికరంగా మారింది. ‘లింగా’ సినిమా ఆడియో విడుదల వేడుక సందర్భంగా రజనీ ఒక విధంగా వివాదాస్పద ప్రకటన చేశాడు. తాము కోట్ల రూపాయలు వెచ్చించి చాలా వేగంగా సినిమాను పూర్తి చేశామని.. అయితే కొంతమంది సంవత్సరాలకు సంవత్సరాలుసినిమా తీస్తుంటారని రజనీ’లింగా’ ఆడియో విడుదల వేడుకలో అన్నాడు!

అసలు సినిమా తీయడానికి అంత సమయం ఎందుకు? అన్నట్టుగా రజనీ మాట్లాడాడు. ఆ మాటలు పరోక్షంగా రాజమౌళిని ఆయన తీస్తున్న’బాహుబలి’ ని ఉద్దేశించనవే అని చాలా మంది అనుకొన్నారు. ఆ తర్వాత రజనీ తన వ్యాఖ్యానాలను సవరించుకొన్నారు. తను బాహుబలిని ఉద్దేశించి ఏమీ అనలేదని వివరణ ఇచ్చాడు. అయినా సూపర్ స్టార్ మాటల అంతరార్థం అందరికీ అర్థం అయ్యింది. ఆ మాటలు కచ్చితంగా రాజమౌళిని ఇబ్బంది పెట్టే ఉంటాయి.

మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్త వార్తలు వస్తున్నాయి. బాహుబలి ఆడియో విడుదల వేడుకకు సూపర్ స్టార్ అతిధిగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. తమిళ వెర్షన్ ఆడియో విడుదల వేడుకకు రజీనిని పిలిపించుకొని మంచి ప్రచారం తెచ్చుకోవాలని రాజమౌళి బ్యాచ్ భావిస్తోందని అంటున్నారు. మరి ఇదే జరిగితే… రాజహౌళి- రజనీకాంత్ ల మధ్య ఎలాంటి విబేదాలూ లేనట్టేనేమో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -