- Advertisement -
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ న్యూరో ఎండోక్రిన్ ట్యూమర్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే.ఈ వ్యాధికి ప్రస్తుతం ఆయన లండన్ లో ఆయన చికిత్స పొందుతున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…నేను బతికుండేది మరికొన్ని నెలలు మాత్రమేనంటూ ఆవేదనాభరితమైన వ్యాఖ్యలు చేశాడు.నేను మహా అయితే రెండేళ్లు బతుకుతానేమో! ఈ విషయాన్ని నా మెదడు నాకు నిత్యం చెబుతోంది’ అంటూ నిరుత్సాహంతో చెప్పాడు.
ప్రస్తుతం తనకు కీమో థెరపీ నాలుగు సైకిల్స్ పూర్తయ్యాయని, ఇంకా రెండు సైకిల్స్ పూర్తి కావాల్సి ఉందని చెప్పాడు. తనకు మొత్తం ఆరు సైకిల్స్ పూర్తయ్యాక స్కాన్ చేయాల్సి ఉంటుందని, ఆ తర్వాత ఏం చేయాలనేది తెలుస్తుందని ఇర్ఫాన్ ఖాన్ చెప్పాడు. ఇర్ఫాన్ ఖాన్ బాలీవుడ్లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.తెలుగులో మహేశ్ బాబు హీరోగా వచ్చిన సైనికుడు సినిమాలో ఇర్ఫాన్ ఖాన్ విలన్గా నటించారు.