Thursday, March 28, 2024
- Advertisement -

మరోసారి బాలయ్యతో ఢీ అంటున్న జ‌గ్గుభాయ్‌..

- Advertisement -

ఎన్టీఆర్‌ బయోపిక్‌తో తీవ్రంగా నిరాశపరిచిన నందమూరి బాలకృష్ణ తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నారు. ప్ర‌స్తుతం తీయ‌బోయె సినిమా విష‌యంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ముందుగా ప్రకటించిన బోయపాటి శ్రీను సినిమాను పక్కన పెట్టి మరీ తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో ఓ మాస్‌ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమా మే 17న లాంఛనంగా ప్రారంభం కానుంది. గతంలో బాలకృష్ణ, రవికుమార్ కాంబినేషన్‌లో వచ్చిన జైసింహా యావరేజ్‌ టాక్‌తో పరవాలేదనిపించింది.

సినిమాల్లో బాలకృష్ణకు సమఉజ్జీ అయిన ప్రతినాయకుడు ఎవరంటే వెంటనే గుర్తిచ్చే పేరు జగపతిబాబు. బోయపాటి డైరెక్షన్లో రూపొందిన ‘లెజెండ్’ సినిమాలో బాలయ్య, జగ్గూబాయ్ న‌ట‌న‌ సినిమాకే హైలెట్ అయింది. పోటీపోటీగా నటించిన ఈ ఇద్దరు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ కానుంది.వీరి కాంబినేషన్ పట్ల ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

కెఎస్ రవికుమార్ బాలయ్యతో చేయనున్న తన నెక్స్ట్ సినిమాలో జగపతిబాబునే ప్రతినాయకుడిగా ఎంచుకున్నారు. దీంతో బాల‌య్య‌తో జ‌గ్గూభాయ్ మ‌రో సారి త‌ల‌ప‌డేందుకు సిద్ద‌మ‌వుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -