శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫొటోలు షేర్ చేస్తూ ఉంటారు. జాన్వీ కపూర్ ఇటీవలి కాలంలో తన డ్రెస్సింగ్ స్టైల్తో అందరి మతులు పోగొడుతుంది. ట్రెండీ దుస్తులలో జాన్వీ కపూర్ని చూస్తున్న నెటిజన్స్కు కాకపుట్టిస్తుంది. ఈ అమ్మడు సింపుల్గా చుడీదార్ వేసుకున్నా.. అందాలు ఆరబోస్తూ ట్రెండీ డ్రెస్ వేసుకున్నా వహ్వా అనాల్సిందే. అందుకే, ఫొటో షేరింగ్ ప్లాట్ఫాం ఇన్స్టాగ్రామ్లో ఆమెకు 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
తాజాగా జాన్వీ కపూర్ ఎర్రటి దుస్తులలో స్ట్రాప్లెస్ ఫ్రాక్ ధరించి ఫొటోషూట్ చేయగా, ఈ ఫొటోలు ప్రతి ఒక్కరి మనసులు దోచుకుంటున్నాయి. ఇప్పటికీ శ్రీదేవి తనయగానే ప్రేక్షకులు జాన్వీని ఆదరిస్తున్న నేపథ్యంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పరచుకునేందుకు జాన్వీ చాలా కష్టపడుతుంది.
ఇక జాన్వీ కపూర్ తాజాగా షేర్ చేసిన ఫొటోలకు వసంత కాలంలో చెర్రీలు అనే క్యాప్షన్ పెట్టింది. రూహి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఇందులో రాజ్కుమార్ రావు, వరుణ్ శర్మలతో కలిసి ఈ చిత్రంలో జాన్వి కపూర్ నటించారు. ప్రస్తుతం ‘దోస్తాన 2’, ‘గుడ్ లక్ జెర్రీ’ చిత్రాలతో బిజీగా ఉంది.