అతిలోక సుందరి శ్రీదేవి కుతురు జాన్వీ కపూర్తో సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుండి మంచి పాపులారీటిని సంపాదించుకుంది.ఇక ఆమె ఇటీవలే ధడక్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది.ఈ సినిమా జాన్వీకి తొలి సినిమా అన్న సంగతి అందరికి తెలిసిందే.మరాఠి మూవీ సైరత్ మూవీకి ఈ సినిమా రీమేక్.ఈ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ వినిపించినప్పటికి కలెక్షన్స్లో దుమ్ములేపింది ఈ సినిమా 150 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్ట్ చేసింది.ఇక ఈ సినిమాలో జాన్వీ నటనపై అందరి ప్రశంసించారు.ఇక తాజాగా ఆమె మరో క్రేజీ ప్రొజెక్ట్లో ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తుంది.
బాలీవుడ్లో జాన్వీ నటించబోయే తదుపరి సినిమాను అధికారికంగా ప్రకటించేశారు. ‘తక్త్’ అనే చారిత్రాత్మక చిత్రంలో జాన్వీ నటిస్తున్నారు. ఈ మూవీకి కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రణ్వీర్సింగ్, కరీనా కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్, భూమి ఫెడ్నేకర్, అనిల్ కపూర్లు ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. ఈ మూవీ 2020లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేశారు.భారీ తారగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా 500 బడ్డెట్తో నిర్మిస్తున్నారు.